Raithu Bandhu | రైతు బంధు పథకాన్ని బంద్ చేసే కుట్ర..!
                    Raithu Bandhu | రైతన్నకు సాగుకు పెట్టుబడి సాయం అందించి భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao ) మండిపడ్డారు. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ.. రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమన్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వొస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమే అని ఆరోపించారు.
అదే రైతుబంధు కింద...                
                
             
								



