Sarkar Live

State

Raithu Bandhu | రైతు బంధు ప‌థ‌కాన్ని బంద్ చేసే కుట్ర‌..!
State

Raithu Bandhu | రైతు బంధు ప‌థ‌కాన్ని బంద్ చేసే కుట్ర‌..!

Raithu Bandhu | రైతన్నకు సాగుకు పెట్టుబడి సాయం అందించి భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా తొల‌గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర‌లు చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao ) మండిప‌డ్డారు. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ.. రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమ‌న్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమ‌ని అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వొస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమే అని ఆరోపించారు. అదే రైతుబంధు కింద...
Uttam Kumar Reddy | రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి సాగు
State

Uttam Kumar Reddy | రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి సాగు

Telangana |  దేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలంలో తెలంగాణలో 66.7లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఇది వ్యవసాయానికి సంబంధించి  అతిపెద్ద రికార్డు అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు రోజుల రైతు పండగలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.  రేపు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రైతు పండుగ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన  స్టాళ్లను పరిశీలించారు. అనంతరం అవగాహన సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్  మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసి దేశంలో మొదటి స్థానం సాధించిందన్నారు. అందుకే రైతులు పండగ చేసుకుంటున్నారని తెలిపారు. రైతులకు మంచ...
Indiramma Illu| ఇందిర‌మ్మ ఇళ్ల‌పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
State

Indiramma Illu| ఇందిర‌మ్మ ఇళ్ల‌పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

Indiramma Illu | ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ముందుగా అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యమివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌క్ర‌మంలో లబ్ధిదారులను ఎంచుకోవాల‌ని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిర‌మ్మ ఇళ్లపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌మిస్తున్నందున త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఈ విష‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌ని సీఎం సూచించారు.  ఏ ద‌శ‌లోనూ ల‌బ్ధ...
TG TET 2024 | టెట్ అభ్యర్థులకు కీల‌క‌ అప్డేట్.. హాల్ టికెట్లు విడుదల‌య్యేది అప్పుడే..
State

TG TET 2024 | టెట్ అభ్యర్థులకు కీల‌క‌ అప్డేట్.. హాల్ టికెట్లు విడుదల‌య్యేది అప్పుడే..

TG TET 2024 Exam Hall Tickets : తెలంగాణలో టెట్ కు భారీగా డిమాండ్ ఉంది. ఇటీవ‌ల టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు వ‌చ్చాయి. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి త‌మ‌ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ 2024 (II) దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్ష కోసం మొత్తంగా 2,48,172 దరఖాస్తులు స‌మ‌ర్పించారు. పేపర్‌-1కు 71,655 , పేపర్‌-2కు 1,55,971 అప్లికేష‌న్లు వ‌చ్చాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు… డిసెంబర్ 26 నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 26 డిసెంబర్ 2024న అందుబాటులోకి రానున్నాయి. అభ్య‌ర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక జనవరి 1, 2025వ తేదీ నుంచి టెట్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మవుతా...
Panchayat Elections | ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు..!
State

Panchayat Elections | ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు..!

3 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం సర్పంచ్ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గ్రామాల్లో మొదలు కానున్న సందడి సంతానం నిబంధన ఎత్తివేతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర పోటీ Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు (Telangana Govt) తీవ్ర కసరత్తు చేస్తోంది. నూతన సంవత్సరంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2025 ఫిబ్రవరి లోనే సర్పంచ్‌ ఎన్నికలను నిర్వహించి అనంతరం జడ్పిటిసీ, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను ఒకేరోజు జరిపితే ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని ముందుగానే గుర్తించిన ఎన్నికల సంఘం.. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. సర్పంచ్‌ ఎన్న...
error: Content is protected !!