Sarkar Live

State

Andesri | తెలంగాణ ఆత్మకు స్వరమిచ్చిన ప్రజాకవి
Cultural, State

Andesri | తెలంగాణ ఆత్మకు స్వరమిచ్చిన ప్రజాకవి

“జయ జయహే తెలంగాణ”తో చరిత్రలో చిరస్మరణీయం గొర్ల కాపరి నుంచి కవి వరకు… అనాథ నుంచి డాక్టరేట్ వరకు — అందెశ్రీ ప్రయాణం ఇదే! Andesri | తెలంగాణ ఆత్మకు కవిత్వం రాసిన గొప్ప కవి అందెశ్రీ (64) ఇక లేరు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన ఆయనను కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్క‌డ‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కష్టాలతో నిండిన బాల్యం సిద్దిపేట జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందె ఎల్లయ్య, సాహిత్య ప్రపంచంలో “అందెశ్రీ”గా పేరు తెచ్చుకున్నారు. తన తల్లిదండ్రులు ఎవరో తెలియని స్థితిలో, అనాథగా పెరిగిన ఆయన కొన్నేళ్లు గొర్రెల కాపరిగా జీవించారు. అయితే అదే స‌మ‌యం ఆయనలో కవిత్వానికి అంకురార్ప‌ణ జ‌రిగింద‌ని తరచుగా చెప్పేవారు. అందెశ్రీ (Andesri) పాఠ‌శాల‌కు వెళ్ల‌లేదు. ఎలాంటి చ‌దువు లేకపోయినా, తన కృషి, పట్టుదలతో తెలుగు సాహిత్యంపై అసాధారణమైన‌ పట్టు సాధించారు. ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం ...
Sponge Parks | మోంతా తుఫాను తర్వాత వరంగల్‌ నగరంలో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి అడుగులు
State, warangal

Sponge Parks | మోంతా తుఫాను తర్వాత వరంగల్‌ నగరంలో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి అడుగులు

Sponge Parks in Warangal : త‌ర‌చూ భారీ వర్షాల‌తో మునిగిపోతున్న వరంగల్‌, హన్మకొండ నగరాలు ఇకపై పచ్చని రక్షణ కవచాన్ని పొందబోతున్నాయి. భూగర్భ జలాలను నిల్వ చేస్తూ, వరదలను అడ్డుకునే ‘స్పాంజ్ పార్క్‌’లు నగరపు భవిష్యత్తు పర్యావరణ సమతుల్యతను సాధించ‌నున్నాయి. హన్మకొండ, వరంగల్ నగరాల్లో ఇటీవ‌ల‌ మోంథా తుఫాను కారణంగా 120 కంటే ఎక్కువ కాలనీలు మునిగిపోయిన నేప‌థ్యంలో , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒక సుస్థిర పట్టణ పరిష్కారాన్ని అమలులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. నగరంలోని వరద ముప్పును తగ్గించి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి “స్పాంజ్ పార్క్‌లు” అనే వినూత్న ప్రాజెక్ట్ ను మొద‌లుపెడుతోంది. స్పాంజ్ పార్క్‌లు వర్షపు నీటిని సహజంగా పీల్చుకుని భూమిలోకి మళ్లించే ప్రదేశాలు. ఇవి నగరంలోని తక్కువ భూమి ఉన్న‌ ప్రాంతాల్లో వరదలను తగ్గించడమే కాకుండా, నీటి నిల్వకు కూడా తోడ్పడతాయి.చ...
Warangal | ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోమారు వర్షం
State, warangal

Warangal | ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోమారు వర్షం

Warangal : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోసారి భారీ వ‌ర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి ప‌లుచోట్ల‌ వరుసగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వరంగల్‌ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంటపాటు పడిన వర్షానికి రహదారులపై వ‌ర‌ద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి ఎనుమాముల మార్కెట్‌లో అమ్మ‌కానికి తెచ్చిన‌ పత్తి, మొక్కజొన్న తడిసిపోవంతో రైతులు క‌న్నీరుమున్నీర‌య్యారు. ఇటీవల ‘మొంథా’ తుపాను ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు మరోసారి వర్షాల ముంపు భయంతో వణికిపోతున్నాయి. రేపు వ‌ర్షం కురిసే అవ‌కాశం తెలంగాణ వెదర్‌ మాన్‌ అంచనా ప్రకారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్...
Theft Gang | వింత దొంగల ముఠా  గుట్టు ర‌ట్టు – నకిలీ వాంతులతో నగలు దోచే మహిళా గ్యాంగ్
State

Theft Gang | వింత దొంగల ముఠా గుట్టు ర‌ట్టు – నకిలీ వాంతులతో నగలు దోచే మహిళా గ్యాంగ్

Women Theft Gang | విచిత్రమైన మహిళా దొంగల ముఠా సంచలనాన్ని రేపింది. బస్సులు, ఆటోలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో తోటి మహిళా ప్రయాణికులను నమ్మించి, "వాంతి" చేస్తున్నట్లు నటిస్తూ నగలు, డబ్బులు కాజేస్తున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. క‌నీవినీ ఎరుగుని రీతిలో కొత్త ర‌హాలో న‌మ్మించి న‌గ‌లు, డ‌బ్బులు కాజేస్తున్న ఆరుగురు సభ్యులతో కూడిన పూర్తిగా మహిళా ముఠా ఉందంతం ఇది. ఈ మ‌హిళ‌ల‌ గుంపు వాంతి చేసుకుంటున్నట్లు నటించి భయాందోళనలకు గురిచేస్తుంటారు. ఆ తర్వాత తోటి ప్ర‌యాణికులు ప‌ర‌ధ్యానంలో ఉండ‌గా వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పారిపోతారని అధికారులు వెల్ల‌డించారు. DCP శశాంక్ సింగ్ మాట్లాడుతూ, "వారిలో ఒకరు ఆటోగానీ బ‌స్సుగానీ ప్ర‌యాణిస్తుండ‌గా ఎంతో క‌లివిడిగా ప్ర‌వ‌ర్తిస్తూ క‌లివిడిగా మాటల్లో దింపుతారు. అందులో ఒకరు వికారం వచ్చినట్లు నటించి దుపట్టా లేదా పాలిథిన్ బ్యాగ్‌లోకి 'వాంతి' చేయడం ప్ర...
Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌
State, Hyderabad

Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై వెంట‌నే నిర్ణయం తీసుకోకపోతే నవంబర్‌ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ కాలేజీలు నిరవధికంగా బంద్ (Colleges Bandh ) చేస్తామ‌ని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్‌ రమేష్‌ బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం రాలేద‌ని తెలిపారు. మొత్తం రూ.1,200 కోట్ల బకాయిల్లో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించింద‌ని చెప్పారు. మిగిలిన రూ.900 కోట్లు దీపావళికి ముందు ఇవ్వాలని కోరామ‌ని కానీ, ఇప్ప‌టివ‌ర‌కు చెల్లించ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.కాగా నవంబర్‌ 2 లోపు ప్రభుత్వం చెల్లింపులపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే, నవంబర్‌ 3 నుంచి రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా...
error: Content is protected !!