Sarkar Live

State

మాజీ డిజిపి హెచ్.జె. దొర మృతి
Hyderabad

మాజీ డిజిపి హెచ్.జె. దొర మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె. దొర మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పోలీస్ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా, సీఐఎస్‌ఎఫ్ డీజీగా కీలక బాధ్యతలు నిర్వహించిన దొర, పోలీస్ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తుచేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేయడమే కాకుండా, పోలీసులను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. దొర  కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు...
మత సామరస్యానికి వరంగల్ ప్రతీక: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
warangal

మత సామరస్యానికి వరంగల్ ప్రతీక: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేటలోని ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో చర్చి నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ నగరం మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దమని కొనియాడారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులంతా కలిసిమెలసి ఉండటమే ఈ ప్రాంత ప్రత్యేకతని, ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజంలో సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. భక్తులందరికీ ఫాతిమా మాత ఆశీస్సులు లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబూబకర్, సీనియర్ నాయకులు ఎస్.టి. పాల్ ఆనంద్, విశ్రాంత బిషప్ జోసెఫ్, ఫాదర్ విజయపాల్, చర్చి గురువులు మర్రెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు....
పది పరీక్షల వేళ 144 సెక్షన్ అమలు: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
warangal

పది పరీక్షల వేళ 144 సెక్షన్ అమలు: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ముఖ్యమైన వివరాలు: పరీక్షా కేంద్రాలు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 150 కేంద్రాలు (హన్మకొండ-64, వరంగల్-47, జనగామ-39). సమయం: ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమలు కాలం: ఏప్రిల్ 16, 2026 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. విధించిన ఆంక్షలు: . పరీక్ష కేంద్రాల సమీపంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటంపై నిషేధం ఉంది. . ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా ధర్నాలకు అనుమతి లేదు. .పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను ప్ర...
Kothapeta Land Scam | వరంగల్ 3వ డివిజన్‌లో భూ బాగోతం
State

Kothapeta Land Scam | వరంగల్ 3వ డివిజన్‌లో భూ బాగోతం

సర్కారు బాటను మాయం చేసి లేఅవుట్! కొత్తపేటలో రియల్ ఎస్టేట్ 'మాయా' జాలం .. Kothapeta Land Scam | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కొత్తపేటలో భూ డెవలపర్లు బరితెగించారు. సామాన్యులకు అందని చట్టాలు తమకు చుట్టాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ, ఏకంగా ప్రభుత్వ రోడ్డునే మాయం చేశారు. పబ్లిక్ వినియోగంలో ఉండాల్సిన బాటను వెంచర్‌లో కలిపేసి, అదే ప్రభుత్వం నుండి లేఅవుట్ అనుమతులు పొందడం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది.3 వ డివిజన్ కొత్తపేట ప్రాంతంలోని సర్కారు రోడ్డుకు కొందరు రియల్టర్లు ఎసరు పెట్టారు. నిబంధనల ప్రకారం వదిలిపెట్టాల్సిన ప్రభుత్వ పానాదిని (బాటను) కబ్జా చేసి, పక్కా ప్లాన్‌తో వెంచర్‌ (Kothapeta Land Scam )గా మార్చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్డును రికార్డుల్లో మాయం చేయడమే కాకుండా, అధికారుల కళ్లు గప్పి లేదా వారి సహకారంతోనే ఈ అక్రమ లేఅవుట్‌కు అనుమతులు సాధించినట్లు ఆర...
దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు
Crime, warangal

దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు

కొనాయమాకుల స్టేజ్ వద్ద చలివేంద్రం ప్రారంభం ఎండలు ముదురుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కొనాయమాకుల స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మామునూరు ఏసీపీ వెంకటేష్  బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ గీసుగొండ సీ ఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని అన్నారు.కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ ,తోపాటు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....
error: Content is protected !!