Sarkar Live

State

Build Now | బిల్డ్ ‌నౌ యాప్ తో భ‌వ‌నాలు, లేఔట్ల అనుమ‌తులు ఈజీ..
State

Build Now | బిల్డ్ ‌నౌ యాప్ తో భ‌వ‌నాలు, లేఔట్ల అనుమ‌తులు ఈజీ..

Build Now | భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ‘బిల్డ్ ‌నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ ‌విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ’బిల్డ్ ‌నౌ’ పేరుతో రూపొందించిన యాప్‌తో పాటు, ఆన్‌లైన్‌ విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. సచివాలయంలో బిల్ట్‌ ‌నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పట్టణాభివృద్ధిలో గతంలో లేని విధంగా అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నార‌ని అందుకే ఈ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామ‌ని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నెరవేరుస్తున్నామ‌ని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకా...
Weather updates | తెలుగు రాష్ట్రాల్లో ఫెంగ‌ల్ తుఫాన్ ప్ర‌భావం.. కొన‌సాగుతున్న వ‌ర్షాలు..
State

Weather updates | తెలుగు రాష్ట్రాల్లో ఫెంగ‌ల్ తుఫాన్ ప్ర‌భావం.. కొన‌సాగుతున్న వ‌ర్షాలు..

Weather updates : తీవ్ర‌మైన‌ఫెంగల్ తుపాను తీరం దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప‌లుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మ‌రోవైపు చలి తీవ్రత కూడా తగ్గింది. ఏపీతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వాన‌లు పడుతున్నాయి. ఈ రోజు వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో .. Telangana Weather updates : తెలంగాణలో ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో చెదురుమదురు వాన‌లు కూరిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఏడో తేదీ వరకు ఇలాంటి వాతావరణం ఉంటుందని చెబుతోంది. ఈనెల 8 నుంచి వాతావరణంలో మార్పులు వొస్తాయని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగానే నమోదవుతాయ చెప్పింది. ఇక తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. మెదక్‌లో అత్యల్పంగా 16.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది,. నిజామాబాద్‌ జిల్లాలో 32...
Aramghar to Zoo Park Flyover | భాగ్యనగరంలో ఆరు లైన్ల‌ భారీ ఫ్లైఓవర్‌
State

Aramghar to Zoo Park Flyover | భాగ్యనగరంలో ఆరు లైన్ల‌ భారీ ఫ్లైఓవర్‌

‌నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్ ఫ్లైఓవ‌ర్‌ Aramghar to Zoo Park Flyover | నిత్యం ట్రాఫిక్‌ ‌కష్టాలలో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..  నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌సిక్స్ ‌లేన్‌ ‌ఫ్లైఓవర్‌ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేతుల మీదుగా ఈ భారీ ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది హైదరాబాద్ లోనే అతిపెద్ద రెండో ఫ్లైఓవర్‌. 24 ‌మీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 636 కోట్ల ఖర్చు చేశారు.  ఫ్లైఓవర్‌కు రెండువైపులా ఎనిమిది కిలోమీటర్ల సర్వీస్‌ ‌రోడ్డు పూర్తి చేయడమే ప్రాజెక్టులో అతి పెద్ద సవాల్‌. ఈ రోడ్ల‌కు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసి సర్వీస్‌ ‌రోడ్‌ను చకచకా నిర్మిస్తున్నారు.ఫ్లైఓవర్‌ ‌పనులు దాదాపుగా 90 శాతం పూర్తయ్యాయి. హెచ్‌ఎం‌డీఏ ఉన్నతాధికారులతో ...
Telugu University | బాచుప‌ల్లిలో తెలుగు యూనివ‌ర్సిటీ కొత్త క్యాంప‌స్ ప్రారంభం
State

Telugu University | బాచుప‌ల్లిలో తెలుగు యూనివ‌ర్సిటీ కొత్త క్యాంప‌స్ ప్రారంభం

Hyderabad | హైద‌రాబాద్‌ బాచుపల్లిలో నిర్మించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) కొత్త క్యాంపస్ ను సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. 100 ఎకరాల ప్రాంగణంలో  ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి రూ.35 కోట్లు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం 39వ వ్యవస్థాపక‌ దినోత్సవాలను సైతం మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ విద్యార్థులకు కంప్యూటర్ల వినియోగంలో 100 కంప్యూటర్లను కేటాయించనున్నట్టు హామీ ఇచ్చారు. విద్యార్థులు డిగ్రీలు పూర్తిచేసుకునే లోగా వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తామ‌ని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపైనే సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు. కృత్రిమ మేథలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించుక...
Raithu Bhrosa | రైతుల‌కు గుడ్ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా
State

Raithu Bhrosa | రైతుల‌కు గుడ్ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా

Raithu Bhrosa |  రైతుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డ‌బ్బులు వారి ఖాతాలలో జ‌మ‌చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రైతు భరోసాపై మంత్రివ‌ర్గ ఉప సంఘం వేశామ‌ని అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.. వరికి రూ.500 బోనస్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం అందించాల‌ని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్ప‌గా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. ఈ ఏడాదిలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే చారిత్రాత్మ‌క‌మ‌ని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని అన్నారు. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. కే...
error: Content is protected !!