Sarkar Live

State

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా
Hyderabad

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
బీసీలకు అన్యాయం చేసినట్లే.. నాయిని భరత్
warangal

బీసీలకు అన్యాయం చేసినట్లే.. నాయిని భరత్

తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించకపోవడం అన్యాయమని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ విమర్శించారు. రాష్ట్రంలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ వారికి రాజ్యసభలో తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల డిమాండ్లను పట్టించుకోకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. ఖాళీ స్థానాలను బీసీలకు కేటాయిస్తే వారి సమస్యలు జాతీయ స్థాయిలో ప్రస్తావనకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునర్విమర్శించి భవిష్యత్తులో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని నాయిని భరత్ హెచ్చరించారు....
రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి
Hyderabad

రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి ఖరారయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi )కూడా రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా వీరిద్దరినీ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ఆయన చేసిన సేవలు, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....
జడ్చర్ల హాస్పిటల్‌లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident
Mahaboobnagar, Crime

జడ్చర్ల హాస్పిటల్‌లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident

Jadcherla Government Hospital Incident | మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అతి భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. మార్చురీ గదిలో భద్రపరిచిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమనడంతో ప్రభుత్వం స్పందించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. Jadcherla Hospital : అసలేం జరిగింది? జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్‌ (32) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం బంధువులు మార్చురీ వద్దకు వెళ్లగా, లోపల కుక్కల శబ్దం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా, ఒక కుక్క భీమేశ్ మృతదేహాన్ని పీక్కుతింటూ కనిపించింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని బంధ...
తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!
State, Hyderabad

తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల సంబరాల ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలు నింపాలని, ప్రతి హృదయంలో స్నేహం, ప్రేమ, ఐక్యత వికసించాలని ఆకాంక్షించారు. ఈ హోలీ పండుగ మన సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, పరస్పర గౌరవాన్ని మరింత బలపరచాలని, విభిన్నతలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగగా నిలవాలని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యాలతో కళకళలాడాలని కోరుకున్నారు. అలాగే ప్రజలు సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజ రంగులతో, సంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. “రంగుల హోలీ ప్రతి మనసును రంగరించి, సంతోషాల వర్షం కురిపించాలని ఆశిస్తున్నాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు...
error: Content is protected !!