Sarkar Live

State

పది పరీక్షల వేళ 144 సెక్షన్ అమలు: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
warangal

పది పరీక్షల వేళ 144 సెక్షన్ అమలు: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ముఖ్యమైన వివరాలు: పరీక్షా కేంద్రాలు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 150 కేంద్రాలు (హన్మకొండ-64, వరంగల్-47, జనగామ-39). సమయం: ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమలు కాలం: ఏప్రిల్ 16, 2026 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. విధించిన ఆంక్షలు: . పరీక్ష కేంద్రాల సమీపంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటంపై నిషేధం ఉంది. . ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా ధర్నాలకు అనుమతి లేదు. .పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను ప్ర...
Kothapeta Land Scam | వరంగల్ 3వ డివిజన్‌లో భూ బాగోతం
State

Kothapeta Land Scam | వరంగల్ 3వ డివిజన్‌లో భూ బాగోతం

సర్కారు బాటను మాయం చేసి లేఅవుట్! కొత్తపేటలో రియల్ ఎస్టేట్ 'మాయా' జాలం .. Kothapeta Land Scam | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కొత్తపేటలో భూ డెవలపర్లు బరితెగించారు. సామాన్యులకు అందని చట్టాలు తమకు చుట్టాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ, ఏకంగా ప్రభుత్వ రోడ్డునే మాయం చేశారు. పబ్లిక్ వినియోగంలో ఉండాల్సిన బాటను వెంచర్‌లో కలిపేసి, అదే ప్రభుత్వం నుండి లేఅవుట్ అనుమతులు పొందడం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది.3 వ డివిజన్ కొత్తపేట ప్రాంతంలోని సర్కారు రోడ్డుకు కొందరు రియల్టర్లు ఎసరు పెట్టారు. నిబంధనల ప్రకారం వదిలిపెట్టాల్సిన ప్రభుత్వ పానాదిని (బాటను) కబ్జా చేసి, పక్కా ప్లాన్‌తో వెంచర్‌ (Kothapeta Land Scam )గా మార్చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్డును రికార్డుల్లో మాయం చేయడమే కాకుండా, అధికారుల కళ్లు గప్పి లేదా వారి సహకారంతోనే ఈ అక్రమ లేఅవుట్‌కు అనుమతులు సాధించినట్లు ఆర...
దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు
Crime, warangal

దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు

కొనాయమాకుల స్టేజ్ వద్ద చలివేంద్రం ప్రారంభం ఎండలు ముదురుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కొనాయమాకుల స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మామునూరు ఏసీపీ వెంకటేష్  బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ గీసుగొండ సీ ఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని అన్నారు.కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ ,తోపాటు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....
దానం,కడియం లకు ఊరట…
Hyderabad

దానం,కడియం లకు ఊరట…

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పును వెలువరించారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేల విషయంలో అనుసరించిన నిర్ణయాన్నే పునరావృతం చేస్తూ, వీరిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆయనపై అనర్హత వేటు పడలేదు. కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కడియం కావ్యకు మద్దతుగా, కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా ఆయన సభ్యత్వం సురక్షితమని స్పీకర్ తేల్చిచెప్పారు.గతంలో ఇతర ఎమ్మెల్యేల పిటిషన్లను ఏ ప్రాతిపదికన కొట్టివేశారో, అదే తరహాలో వీరిపై దాఖలైన ఫిర్యాదులను కూడా స్పీకర్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాలకు షాక్? చట్టసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ గట...
మడికొండలో సెగలు రేపుతున్న ‘డంపింగ్ యార్డ్’ వివాదం – Dumping Yard Controversy
warangal

మడికొండలో సెగలు రేపుతున్న ‘డంపింగ్ యార్డ్’ వివాదం – Dumping Yard Controversy

తక్షణమే ఎత్తివేయాలని నిరాహారదీక్ష కు సిద్దమైన గ్రామస్తులు.. Madikonda Dumping Yard Controversy | హన్మకొండ జిల్లా మడికొండలో డంపింగ్ యార్డ్ వివాదం ముదురుతోంది. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నామంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఇక పోరాటమే శరణ్యమని భావించిన స్థానికులు, తక్షణమే డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. అనారోగ్యాల నిలయంగా మడికొండ గత కొంతకాలంగా మడికొండ శివార్లలో ఉన్న డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దుర్వాసన, దుమ్ము, ధూళి వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల పాలు: ఇప్పటికే గ్రామంలోని అనేకమంది అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే మడికొండలో ప్రతి ఇల్లూ ఒక ఆసుపత్రిలా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు: డంపిం...
error: Content is protected !!