Food Poisoning | కలవరపెడుతున్న వరుస ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..
Food Poisoning | హైదరాబాద్: మహానగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో కలుషితాహారం (Food Poisoning) కారణంగా 66 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, మాదాపూర్లోని చంద్రానాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
మైనారిటీ గురుకుల పాఠశాలలో
మైనారిటీ గురుకుల పాఠశాలలో 22 మందికి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. 22 మంది విద్యార్థినులు (పాఠశాలలో మొత్తం 337 మంది చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనంలో పాడైపోయిన పెరుగు ఇవ్వడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థినులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్లో కింగ్కోఠి మర...




