Sarkar Live

State

Global Summit కు స‌ర్వం సిద్ధం- ముస్తాబైన‌ ఫ్యూచ‌ర్ సిటీ
State

Global Summit కు స‌ర్వం సిద్ధం- ముస్తాబైన‌ ఫ్యూచ‌ర్ సిటీ

హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ (Telangana Global Summit)కు స‌ర్వం సిద్ధ‌మైంది. డిసెంబ‌రు 8, 9 తేదీల్లో నిర్వ‌హించే ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు (International event)కు దేశ విదేశాల నుంచి ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. హైద‌రాబాద్ స‌మీపంలోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ (Bharat Future City) వ‌ద్ద ఈ స‌మ్మిట్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. ఇది రెండు రోజుల‌పాటు జ‌రిగే స‌ద‌స్సు అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల ద‌ర్శ‌నార్థం (ప‌బ్లిక్ ఎగ్జిబిష‌న్‌) ఫ్యూచ‌ర్ సిటీని డిసెంబ‌రు 10, 11, 12 తేదీల్లో తెర‌చి ఉంచ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ల‌క్ష్యం ఏమిటి? తెలంగాణ అభివృద్ధి ల‌క్ష్యం Vision 2047లో భాగంగా ఈ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీని సాధించుకోవాల‌న్న‌ల‌క్ష్యంతో స‌ర్కారు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింది. దీనిని ...
హైదరాబాద్ ORRపై ఏఐ నిఘా: అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్.. 14 ప్రాంతాల్లో MVDS వ్యవస్థ
State, Hyderabad

హైదరాబాద్ ORRపై ఏఐ నిఘా: అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్.. 14 ప్రాంతాల్లో MVDS వ్యవస్థ

హైదరాబాద్‌ చుట్టూ విస్త‌రించిన ఔట‌ర్ రింగ్ రోడ్ (Hyderabad ORR)పై రోజూ వేలాది వాహ‌నాలు ప్ర‌యాణిస్తుంటాయి. పెరుగుతున్న ర‌ద్దీ, డ్రైవింగ్‌లో నిర్ల‌క్ష్యం పాటించ‌డం వ‌ల్ల‌ ఇక్క‌డ త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. ట్రాఫిక్‌ నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేయ‌డం, అతి వేగం (Overspeeding)తో డ్రైవ్ చేయ‌డం, ఒక లేన్ నుంచి మ‌రో దానికి మారిన‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం, అలాగే రాంగ్ సైడ్‌లో బైకులు, కార్లు పార్కింగ్ చేయ‌డం తదిత‌ర కార‌ణాల వ‌ల్ల యాక్సిడెంట్లు (ORR accidents) నిత్య‌కృత్య‌మ‌య్యాయి. వాహ‌న‌దారుల ఈ ధోర‌ణి వ‌ల్ల అనేక ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. అయితే.. ఈ ప‌రిస్థితిని అరిక‌ట్టేందుకు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) ప్ర‌త్యేక చ‌ర్యల‌కు శ్రీ‌కారం చుట్టారు. హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) సంస్థ స‌హ‌కారంతో ఓ బృహ‌త్త‌ర కార్యానికి ముంద‌డుగు వేశారు. హైస్పీడ్ వ‌ల్లే నిత్యం...
Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ
State, Hyderabad

Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ

Availability of urea : ఖరీఫ్ సీజ‌న్-2025లో తెలంగాణ‌ (Telangana)కు యూరియాను రైతుల అవ‌స‌రాల‌కు అద‌నంగానే స‌ర‌ఫ‌రా చేశామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. యూరియా కొర‌త ఉండొచ్చ‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో యూరియా కొర‌త లేకుండా ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని కేంద్ర ర‌సాయ‌న ఎరువుల శాఖ స‌హాయ మంత్రి అనుప్రియ పటేల్ (Minister of State for Fertilisers Anupriya Patel) తెలిపారు. ఈ రోజు లోక్‌స‌భలో కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఈ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. యూరియా కొర‌త‌పై క్లారిటీ ఖరీఫ్ సీజన్ (2025 Kharif season) సందర్భంగా తెలంగాణ రైతులకు అత్యంత కీలకమైన యూరియా ఎరువు (Fertiliser) సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వం ఆశాజనకమైన సమాచారం ప్రకటించింది. యూరియా కొరత ఉండొచ్చని రైతులు అనుమానపడుతున్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఇచ్చిన...
Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన
State, Hyderabad

Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన

ఇండిగో కోచిన్ విమానం రద్దుపై తీవ్ర అసంతృప్తి.. నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్టు Ayyappa Devotees Protest : శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు బ‌య‌ల్దేరిన అయ్య‌ప్ప భ‌క్తులు (Ayyappa Devotees) హైద‌రాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (RGIA) వ‌ద్ద ఈ రోజు ఆందోళన‌ (Protest) కు దిగారు. కోచిన్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం ర‌ద్దు కావ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం సాయంత్రమే బ‌య‌ల్దేరాల్సిన విమానం ర‌ద్దు అయ్యింది. దీంతో అయ్య‌ప్ప భ‌క్తులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్నారు. స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు కూడా విమానం బ‌య‌ల్దేర‌క‌పోవ‌డం అయ్య‌ప్ప (ayyappa) భ‌క్తుల అస‌హ‌నానికి కార‌ణ‌మైంది. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎయిర్‌పోర్టు అధికారులు క్లారిటీ ఇవ్వ‌కపోవ‌డంతో నిర‌స‌న‌కు దిగారు. మ‌క‌ర జ్యోతి స‌మ‌యంలో శ‌బ‌రిమ‌లల...
మేడారంలో భ‌క్తుల సందడి – మ‌హాజార‌త‌కు ముందుగానే పెరుగుతున్న ర‌ద్దీ – Medaram Jathara 2025
State, warangal

మేడారంలో భ‌క్తుల సందడి – మ‌హాజార‌త‌కు ముందుగానే పెరుగుతున్న ర‌ద్దీ – Medaram Jathara 2025

Medaram Jathara 2025 : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర (Sammakka Saralamma Jathara) జ‌న‌వ‌రి 28 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లం మేడారంలో అత్యంత వైభ‌వంగా జ‌రిగే ఈ మ‌హోత్స‌వానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏర్పాట్లు (Medaram Jathara arrangements) ముమ్మ‌రంగా సాగుతున్నాయి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం మెరుగైన సౌక‌ర్యాలు కల్పిస్తోంది. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తుండ‌గా ఆయా శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాతి కట్ట‌డాల‌తో దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ‌ మ‌రోవైపు మేడారం దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే శ్రీ‌కారం చుట్టింది. వంద‌లాది ఏళ్ల‌యినా చెక్కుచెద‌ర‌కుండా రాతి క‌ట్ట‌డాల‌తో నిర్మాణం చేప‌ట్టేందుకు మాస్ట‌ర్‌ప్లాన్‌ను రూపొం...
error: Content is protected !!