Sarkar Live

State

మేడిగడ్డ పునరుద్ధరణే లక్ష్యం: క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన
warangal

మేడిగడ్డ పునరుద్ధరణే లక్ష్యం: క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన

​●కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సమగ్ర విచారణ.. NDSA మార్గదర్శకాలతోనే ముందుకు ​●లోతుగా పరిశీలన... సాంకేతిక పరీక్షల సమీక్ష కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని సోమవారం మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. కుంగిన పిల్లర్ర్స్ (స్తంభాల) వద్ద జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను స్వయంగా పరిశీలించి, పునరుద్ధరణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​లోతుగా పరిశీలన.. సాంకేతిక పరీక్షల సమీక్ష ​బ్యారేజీ వద్ద పిల్లర్స్ 20, 21, 22 లో బోర్ రిగ్స్ ద్వారా జరుగుతున్న శాంపిల్స్ సేకరణను ముఖ్యమంత్రి నిశితంగా గమనించారు. దాదాపు 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) కు పంపనున్నట్లు అధికారుల...
జగిత్యాల గడ్డపై నేడు ‘కేసీఆర్’ రణగర్జన! గులాబీమయమైన పట్టణం! ‌‌ – KCR Jagtial Sabha
State, Karimnagar

జగిత్యాల గడ్డపై నేడు ‘కేసీఆర్’ రణగర్జన! గులాబీమయమైన పట్టణం! ‌‌ – KCR Jagtial Sabha

KCR Jagtial Sabha | తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి జగిత్యాల వేదికవుతోంది. కాంగ్రెస్‌ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు, ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాల మినీ స్టేడియంలో సమరశంఖం పూరించబోతున్నారు. ఐదు దశాబ్దాల క్రితం రైతుకూలీల జైత్రయాత్రతో జంగ్ నడిపిన ఈ గడ్డపై, ఇప్పుడు మరో రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమైంది. సభా వేదికగా కేసీఆర్ చేసే ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జగిత్యాల ఖిల్లా: కలిసొచ్చిన సెంటిమెంట్ జగిత్యాల గడ్డకు మరియు కేసీఆర్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ మినీ స్టేడియంలో సభ (KCR Jagtial Sabha) జరిగినప్పుడల్లా ఉద్యమంలో లేదా రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు వచ్చాయి. 2001: పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి సభతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. 2003: ధర్మపురి సింహగర్జనతో గోదావరి పుష్కరాలకు న...
పేకాట శిబిరంపై పోలీసుల దాడి: నలుగురి అరెస్ట్
warangal

పేకాట శిబిరంపై పోలీసుల దాడి: నలుగురి అరెస్ట్

గీసుకొండ మండల పరిధిలోని కొమ్మాల గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం గీసుకొండ పోలీసులు మరియు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. ​ఘటన వివరాలు.. ​గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ శివారులోని కడారి రాజుకు చెందిన వ్యవసాయ భూమిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై స్పందించిన గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ నేతృత్వంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి దాడి నిర్వహించారు. ​పట్టుబడిన నిందితులు: ​కడారి రాజు (40), కొమ్మాల ​దునికే కొమురయ్య (41), విశ్వనాధపురం ​బసికే ప్రభాకర్ (57), కొమ్మాల ​లకావత్ గణేష్ (24), విద్యార్థి, విశ్వనాధపురం ​పరారీలో ఉన్నవారు: వాంకుడోత్ రాజు, పల్లె నరేష్‌లు పోలీసుల నుండి తప్పించుకున్నారు. ​స్వాధ...
​వ్యాపారాల అభివృద్ధికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి: అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి
warangal

​వ్యాపారాల అభివృద్ధికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి: అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి

చిన్న వ్యాపారమైనా, పెద్ద కంపెనీ అయినా ప్రభుత్వ గుర్తింపు ఉంటేనే మరిన్ని అవకాశాలు లభిస్తాయని, ప్రతి మహిళా పారిశ్రామికవేత్త తన వ్యాపారాన్ని 'ఉద్యమ్'లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి పిలుపునిచ్చారు. ​శుక్రవారం గీసుగొండ మండల కేంద్రంలోని ప్రగతి మండల సమైక్య కార్యాలయంలో, అధ్యక్షురాలు గట్టు రాధిక అధ్యక్షతన వీఓఏలకు (VOA) నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి మహిళా ఆదాయాభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్యమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ​ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు ​తక్కువ వడ్డీకే రుణాలు: బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు పొందే అవకాశం. ​ప్రభుత్వ చేయూత: ప్రభుత్వ టెండర్లలో ప్రాధాన్యత, వివిధ సబ్సిడీ పథకాలు. ​మార్కెటింగ్ సౌకర్యం: బ్రాండింగ్, ల...
Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..
State

Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి భారీ ఎత్తున బాయిల్డ్ రైస్ సేకరించాలని, పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణ తెలంగాణలో యాసంగి (Rabi) పంట బాయిల్డ్ రైస్ (Boiled Rice ) మిల్లింగ్‌కు ఎంతో అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణలో సుమారు 90 ఎల్ఎంటీ (LMT) ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ (10% నూకతో) సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం స్పంద...
error: Content is protected !!