Sarkar Live

State

HILT Policy లీకేజ్ క‌ల‌క‌లం – విజిలెన్స్ దర్యాప్తు వేగవంతం
State, Hyderabad

HILT Policy లీకేజ్ క‌ల‌క‌లం – విజిలెన్స్ దర్యాప్తు వేగవంతం

HILT Policy Leak : తెలంగాణ (Telangana)లో హిల్ట్ పాల‌సీ లీకేజ్ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప‌రిపాల‌న ప‌రంగానే కాకుండా రాజ‌కీయంగా ఇది పెద్ద దుమారం రేపింది. ప్ర‌భుత్వానికి ఎంతో ప్రాముఖ్యం క‌లిగిన ఈ పాల‌సీ ప‌త్రాన్ని (Draft Document) లీక్ చేసిందెవ‌రు.. దీని వెనుక ఉన్న వారెవ‌వ‌రు? అనే విష‌యంపై విజిలెన్స్ విభాగం విచార‌ణ (Vigilance Investigation) చేప‌ట్టింది. ఈ లీకేజ్‌ వ్య‌వ‌హారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశాలు జారీ చేశార‌ని తెలుస్తోంది. హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే ఏమిటి? హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే హ‌య్య‌ర్ ఇంపాక్ట్ లాంగ్ ట‌ర్మ్ పాల‌సీ (Higher Impact Long-Term Policy) అని అర్థం. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేప‌ట్టాల్సిన అభివృద్ధికి సంబంధించిన స‌మ‌గ్ర విధానం ఇది. 10–15 సంవత్సరాల దీర్ఘ‌కాలిక ప్రణాళికను ...
విస్త‌రిస్తున్న Seasonal flu ..రాష్ట్రంలో వైరల్ ఫీవర్ల క‌ల‌క‌లం
State, Hyderabad

విస్త‌రిస్తున్న Seasonal flu ..రాష్ట్రంలో వైరల్ ఫీవర్ల క‌ల‌క‌లం

Seasonal flu : తెలంగాణ‌లో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధులు (ILI కేసులు) కేసులు విస్త‌రిస్తున్నాయి. వైర‌ల్ ఫీవ‌ర్ల (viral fevers) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీటి తీవ్రత హైద‌రాబాద్ (Hyderabad)లో ఎక్కువ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండు వారాలుగా ఆస్ప‌త్రుల్లో అధిక జ్వరం, దగ్గు, శరీరనొప్పులతో వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు. Seasonal flu : ఆస్ప‌త్రుల్లో పెరిగిన‌ ర‌ద్దీ హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రి (Gandhi Hospital), ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ( Osmania General Hospital-OGH), న‌ల్లకుంట ఫీవర్ హాస్పిటల్ (Fever Hospital), NIMSతో పాటు చిన్న క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు కిట‌కిట‌లాడుతున్నాయి. ఈ ఆస్ప‌త్రుల్లో వ‌చ్చేవారిలో తీవ్ర జ్వ‌రం, ఇన్‌ఫ్లూయెంజా ల‌క్ష‌ణాలు ఉన్న వారే (patients) ఎక్కువ‌గా ఉంటున్నార‌ని వైద్యులు తెలి...
Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!
State, Crime

Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!

హుటాహుటిన ముంబైకి మళ్లింపు.. ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్! హైదరాబాద్‌ | కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో 'మానవబాంబు' బెదిరింపు (Indigo Bomb Threat) కలకలం సృష్టించింది. ఈ తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా హెచ్చరిక అందడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించారు. Bomb Threat : ప్రమాద హెచ్చరిక ఎలా వచ్చింది? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈరోజు వేకువజామున 1:20 నిమిషాలకు బయలుదేరిన ఈ ఇండిగో విమానం (Flight) ఉదయం 7:42 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. "విమానంలో మానవబాంబు ఉంది, దీన్ని పేల్చివేస్తాం" అంటూ దిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వ‌చ్చాయి.. ముంబైలో కట్టుదిట్టమైన భద్రత ఈమెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే అప్రమత్తమై, విమ...
Fake ACB DSP | నకిలీ ఏసీబీ డీఎస్పీ ముసుగులో వసూళ్లు
Crime, warangal

Fake ACB DSP | నకిలీ ఏసీబీ డీఎస్పీ ముసుగులో వసూళ్లు

ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఘరానా ముఠా అరెస్టు.. రూ. 50 లక్షలకు పైగా దోపిడీ ముఠాలోని ఐదుగురి సభ్యుల అరెస్టు Fake ACB DSP Arrest | వరంగల్ : ఏసీబీ డీఎస్పీగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను బెదిరించి, భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఒక ఘరానా మోసగాడితో సహా ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ముఠాలో మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఐదు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన రాచంపల్లి శ్రీనివాస్ (Rachampalli Srinivas) అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు (45) ఉన్నాడు. అతనికి సహకరించిన నలుగురు వ్యక్తులు (న...
Telangana Employees | ఉద్యోగులకు స‌ర్కారు గుడ్ న్యూస్‌
State, Hyderabad

Telangana Employees | ఉద్యోగులకు స‌ర్కారు గుడ్ న్యూస్‌

పెండింగ్ బిల్లులకు రూ. 707.30 కోట్లు విడుదల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు హైదరాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు (Telangana Employees) తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తాజాగా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ అధికారులు శనివారం నవంబర్ నెలకు సంబంధించిన ఈ నిధులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 700 కోట్లకు పైగా నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తోంది. నాలుగు నెలలుగా బకాయిల చెల్లింపు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ వస్తోంది. నవంబర్ నెల...
error: Content is protected !!