Sarkar Live

State

Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
State, warangal

Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం

రూ.2 కోట్ల విలువైన బోగీ దగ్ధం! మానుకోట (Mahaboobabad): మానుకోట జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌ (Kesamudram Railways Station)లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క‌సారిగా మంటలు (Fire Accident) చెల‌రేగాయి. దీంతో ఆ బోగీలో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు ప‌రుగులు తీశారు. పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొంద‌రు కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది. కేసముద్రం (Kesamudram SI) ఎస్సై మురళీధర్ రాజ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రక...
South Central Railway | సికింద్రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ప్ర‌త్యేక రైళ్లు
Hyderabad, State

South Central Railway | సికింద్రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ప్ర‌త్యేక రైళ్లు

South Central Railway : ప్రయాణికులకు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే శుభ‌వార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి మైసూరు (Secunderabad–Mysuru), అలాగే చ‌ర్ల‌ప‌ల్లి నుంచి కాకినాడ టౌన్ (Charlapalli–Kakinada Town) మార్గాల్లో ప్రత్యేక రైళ్ల‌ను న‌డిపిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రైలు ప్రయాణికుల సంఖ్య ఈ మధ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway - SCR) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో ఏసీ (AC), స్లీపర్ (Sleeper), జనరల్ (General) తరగతి కోచ్‌లు ఉండటంతో అన్ని తరగతుల ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ – మైసూరు మధ్య ప్రత్యేక రైళ్లు ఈ మార్గంలో నడిచే ప్రత్యేక రైళ్ల నంబర్లు 07033 / 07034. ఇవి ఆగస్టు 8 నుంచి 30వ తేదీ వరకు న‌డ‌వ‌నున్నాయి. మొత్తం ఎనిమిది స...
Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ
State, Hyderabad

Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ

హైదరాబాద్ : నగరంలో పనిచేస్తున్న 17 మంది ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బదిలీ (Police transfer) చేసి, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి. Police transfer బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల జాబితా షేక్ కవియుద్దీన్ (డిఐ బంజారాహిల్స్), ధమిరెడ్డి గిరి (డిఐ నారాయణగూడ), డి రామ్ బాబు (సిటిసి), ఎం బషీర్ అహ్మద్ (డిఐ మార్కెట్ పిఎస్), విక్రమ్ సింగ్ బందెలి (డిఐ లేక్ పిఎస్), నాగార్జున ధరావత్ (డిఐ కుల్సుంపురా), ఎం వర ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), అనురాధ బాల్నింగని (SHO కార్ఖానా), రమణ ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), రామకృష్ణ వలిశెట్టి (SB హైదరాబాద్), దేవేందర్ రమావత్ (ఎస్‌హెచ్‌ఓ బండ్లగూడ), గురునాథ్ కత్రావత్ (డిఐ గుడిమల్కాపూర్), వెంకట్ రెడ్డి భీమిడ్ (SHO ఖైరతాబాద్), రాజశేఖర్ శిలంపల్లె (డీఐ రాంగోపాల్‌పేట), నేతాజీ చిర్రా (SHO రెయిన్...
Kaleshwaram  | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్
Hyderabad, State

Kaleshwaram | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్

హైద‌రాబాద్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram Project ) పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వ‌రం రిపోర్టు పేరిట 60 పేజీల నివేదిక‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సోమ‌వారం విడుద‌ల చేస్తూ.. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించింది. కాంగ్రెస్ స‌ర్కార్ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం దీటుగా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన ఆరోప‌ణ‌ల‌కు సూటిగా స‌మాధానం ఇచ్చారు. కాళేశ్వ‌రం వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ వీక్షించేందుకు అన్ని జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు కాళేశ్వ‌రం గురించి వివ...
Guvvala Balaraju : బిఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై
State

Guvvala Balaraju : బిఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై

త్వరలో బీజేపీలో చేరే ఛాన్స్ Nagar Kurnool | బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌ షాక్ త‌గిలింది. మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్ట‌ర్‌ గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. తన పదవుల‌కు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని బాల‌రాజు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా లభించిన గుర్తింపు, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు. అలాగే, త‌న‌ మిషన్‌ ‌మాత్రం కొనసాగుతుంద‌ని, చివరి వరుసలో ఉన్న వ్యక్తిని నిలబెట్టడమే త‌న‌ లక్ష్యం అని పేర్కొన్నారు. గువ్వల బలరాజు (Guvvala Balaraju ) తన రాజీనామా వెనుక ఎటువంటి నిందలు లేవని, కేవలం గౌరవం, కృతజ్ఞతతోనే పార్టీకి వీడ్కోలు చెబుతున్నానని స్ప‌ష్టం చేశారు. ‘ఇది బాధతో కూడిన రాజీనామా - కానీ పార్టీ పట్ల నా గౌరవం మారద ...
error: Content is protected !!