Sarkar Live

State

Warangal : వరంగల్ లో దంచికొట్టిన వాన.. పలు మార్గాల్లో రాకపోకలు బంద్..
warangal

Warangal : వరంగల్ లో దంచికొట్టిన వాన.. పలు మార్గాల్లో రాకపోకలు బంద్..

Warangal News : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతుండడంతో కాలనీలు, రహదారులు కుంటలు, వాగులను తలపిస్తున్నాయి. బట్టలబజార్‌, పాతబీటుబజార్‌ రోడ్లపై భారీగా నీరు నిలిచింది. హంటర్‌రోడ్‌, ఎన్టీఆర్‌నగర్‌, రామన్నపేట, శివనగర్‌, కరీమాబాద్‌ శాకరాశికుంట, ఎన్‌ఎన్‌నగర్‌, ఎస్​ఆర్​ నగర్​, గరీబ్​నగర్​ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయి.. ఇండ్లలోకి నీరు చేరింది. ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్‌ నీటిమునిగింది. దీంతో అక్కడున్న గుడిసెవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిలో అండర్​ రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  ఇక హన్మకొండలోని గోకుల్ నగర్, టీ జంక్షన్, అంబేడ్కర్ భవన్ వంటి పలు ప్రాంతాల్లో రహదారులు...
Hanmakonda |  మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట ధ‌ర్నా..
State

Hanmakonda | మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట ధ‌ర్నా..

Hanmakonda News : హనుమకొండ రాంనగర్ లోని దేవాదాయ శాఖ‌ మంత్రి కొండా సురేఖ (Konda Surekha ) ఇంటి వద్ద సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో కార్మికులు ధ‌ర్నా నిర్వ‌హించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal ) అక్షయపాత్రకు ఇన్వొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం ఇంటిలోకి చొచ్చుకుపోయేందుకు మ‌ధ్యాహ్న భోజ‌న కార్మికులు (Mid-Day Meal Workers) యత్నించారు. నెలకు వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడం చాలా బాధకరమ‌ని పేర్కొన్నారు. ఓట్ల కోసం మధ్యాహ్న భోజన కార్మికులను కాంగ్రెస్ పార్టీ (Congress Party) మోసం చేసింద‌ని ఫైర్ అయ్యారు. తమ స‌మ‌స్య‌ల‌ను వెల్ల‌బోసుకుందామ‌ని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు వెళ్తే.. పోలీసులు అరెస్టు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఎలాంటి జీతాలు లేకున్నా కూడా అప్పులు తెచ్చి మ‌రీ విద్యార్థుల కోసం వండిపెట్టామని, ఇప్పుడు మాకు ఉపాధి లేక...
KTR | ఆరు గ్యారెంటీలే ఆర్థిక రంగానికి నష్టం – కేటీఆర్
Hyderabad, State

KTR | ఆరు గ్యారెంటీలే ఆర్థిక రంగానికి నష్టం – కేటీఆర్

KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. కాగ్(CAG) క్వార్ట‌ర్లీ రిపోర్టుపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగ్ త్రైమాసిక నివేదిక ప్ర‌కారం రాష్ట్ర ఆదాయం బాగా త‌గ్గింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం త‌గ్గ‌డం ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్లక్ష్యం వైఫ‌ల్యంతో ఆర్థిక రంగం దెబ్బ‌తింటోంది. ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ హామీ.. ఆర్థిక రంగానికి న‌ష్టం చేసింది. రాష్ట్ర ఆదాయం త‌గ్గుతుంటే.. అప్పులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ఆదాయం తగ్గుముఖం పడుతోంది, అప్పులు పెరుగుతున్నాయి. ఇది రాకెట్ సైన్స్ కాదు. ఇది సాధారణ గణితం. కాంగ్రెస్ అసమర్థత భారంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది రూ. 2,738 కోట్ల మిగులు ఉంటుంద‌ని బ‌డ్జెట్‌లో చూపారు. మొద‌టి ...
Rain Alert |  మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు
State, AndhraPradesh

Rain Alert | మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు

IMD Rain Alert to Telangana and AP : బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. మ‌రోవైపు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న (బుధవారం) అల్పపీడనం ఏర్పడుతుందని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక విష‌యాల‌ను వెల్ల‌డించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందాఇ. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని 13 జిల్లాలకు హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, సిద్దిపేట, హన్మ‌కొండ‌, వరంగల్‌, ములుగు, మ...
Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Hyderabad, State

Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో వరదల నివారణకు ‘మూసీ పునరుజ్జీవనమే’ మంత్రం హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం తగ్గించేందుకు సీఎం ప్రత్యేక ప్రణాళిక మూసీకి అనుసంధానం – చెరువులు, కుంటలు, నాలాల కలయికతో నగర భద్రత Hyderabad Rains | హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేలా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Ravanth Reddy) ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్ర...
error: Content is protected !!