Sarkar Live

State

Asifabad | ఆసిఫాబాద్‌లో భారీ వ‌ర్షాల‌తో నీట‌మునిగిన గ్రామం
Adilabad, State

Asifabad | ఆసిఫాబాద్‌లో భారీ వ‌ర్షాల‌తో నీట‌మునిగిన గ్రామం

Kumram Bheem Asifabad : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది, సమీపంలోని వాగు ఉధృతంగా ఉప్పొంగుతోంది. దీంతో చింతలమానేపల్లి మండలంలోని డిమ్డా గ్రామం గురువారం పూర్తిగా మునిగిపోవ‌డంతో మిగ‌తా ప్రాంతాల‌తో సంబంధాలు తెగిపోయాయి. వరదల కారణంగా ఇండ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటి నుంచి భయంతో నివసిస్తున్న నివాసితులు, తమను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని, ప్రాథమిక అవ‌స‌రాలుక ల్పించి భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రాణహిత న‌ది (Pranihita River), పెద్దవాగు వాగుల ఒడ్డున ఉన్న అనేక ఇతర లోతట్టు ప్రాంతాలు కూడా తెగిపోయే ప్రమాదంలో ఉన్న‌ట్లు స‌మాచారం. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నందున బురదమయమైన ప్రాంతాలలో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రాలు, సమీప పట్టణాలకు చేరుకోవడానికి ద్విచక్ర వాహనాలు, ఆటో-రిక్షాలపై ఆధారపడుతున్నారు. ...
Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
Hyderabad, State

Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

Secunderabad : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు కీలక మార్గాల్లో తాత్కాలికంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. Secunderabad -ఆర్సీకేరే (07079/ 07080) ప్రత్యేక రైలు ఈనెల 13 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతీ ఆదివారం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అర్పికేరేలో బయ లుచేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్-అర్సికెరే (07060/07010) హైదరాబాద్-అర్సీకేరీ (07060/07010) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి ...
HYDRAA | హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేత‌లు
State, Hyderabad

HYDRAA | హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేత‌లు

ఆక్రమణకు గుఐన 1,094 గజాల భూమి స్వాధీనం HYDRAA Hyderabad : హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం రాజేంద్రనగర్ మండలం హైదర్‌నగర్‌లోని ఆక్రమణలను కూల్చివేసింది. అక్రమంగా క‌బ్జాచేసిన 1,094 చదరపు గజాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. 2001లో, ఏజీ ఆఫీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ హైదర్‌నగర్‌ (Hydernagar) లోని నలంద నగర్ కాలనీ పేరుతో ఒక లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది, దీనిని అప్పట్లో హుడా ఆమోదించింది. అయితే, ఆ భూమిని అమ్మినవారు పక్కనే ఉన్న 1,004 చదరపు గజాల స్థలాన్ని తమ ఆస్తిలో భాగంగా క్లెయిమ్ చేసుకుని దానిని ఆక్రమించుకున్నారని హైడ్రా అధికారులు తెలిపారు. ప్రజా సౌకర్యాల కోసం కేటాయించిన భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ నలంద నగర్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు తర్వాత, హైడ్రా 1,094 చదరపు గజాలు నలంద నగర్‌కు చెందినవిగా గుర్తించింది. మంగళవారం, హైడ్రా అధ...
Heavy Rains | అల‌ర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వ‌ర్షాలు
State

Heavy Rains | అల‌ర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వ‌ర్షాలు

Rain Alert | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్ ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశ ఉన్న‌ట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. బుధవారం భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌...
పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన  – Ration Cards
State, Hyderabad

పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన – Ration Cards

హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల (Ration Cards) పంపిణీకి తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అమేరకు అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ కార్డులు అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో కలిపి 11.3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్‌ అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం మ...
error: Content is protected !!