Sarkar Live

State

Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు
Hyderabad, State

Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు

Hyderabad | ప్రజాభవన్‌లో శ‌నివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 151 మండల మహిళా సంఘాల బస్సు యజమానులకు రూ.1.05 కోట్ల చెక్కులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హాల‌క్ష్మి ఉచిత బ‌స్సు ( Free Bus scheme) ప‌థ‌కంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన "మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం" విజయవంతమవుతోంద‌న్నారు. అంతకుముందు మహిళా రచయితలు, కవులు రచించిన "మహా లక్ష్మి – మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు" అనే పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళల ప్రయాణ అనుభవాలను కవిత్వం రూపంలో చదివి వినిపించారు. ఈసంద‌ర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “ఒక్క చేతి గుర్తు చూపితే చాలు.. బస్సు ముంగిట నిలుస్తుంది.ఇది మహిళలకు సమానత్వం మీద ముందడుగు.” అని అన్నారు. ఇప్పటివరకు ప్రభ...
ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
Crime, Adilabad

ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు శుక్ర‌వారం ఆకస్మిక దాడులు నిర్వహించారు కోటిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ రైతు వ‌ద్ద నుంచి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ ఆకిరెడ్డి నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవల ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. .. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2025 జూన్ లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్ల‌డించింది. ఈమేర‌కు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్ర‌క‌టించింది. ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్...
జాబ్ క్యాలెండ‌ర్ కోసం ఉద్యమానికి పిలుపు.. BRSV నేతల అరెస్టులతో తీవ్ర‌ ఉద్రిక్తత
Hyderabad, State

జాబ్ క్యాలెండ‌ర్ కోసం ఉద్యమానికి పిలుపు.. BRSV నేతల అరెస్టులతో తీవ్ర‌ ఉద్రిక్తత

BRSV Protest in Hyderabad : రాష్ట్రంలో ఉద్యోగ నియామ‌కాల‌ను చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ యువత చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసనకు ముందు రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. BRS విద్యార్థి విభాగం (BRSV) నాయ‌కులు , నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో వివాదాస్పద పరిస్థితులు తలెత్తాయి. ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ 'చలో సెక్రటేరియట్' నిరసనకు ముందు భారత రాష్ట్ర సమితి విద్యార్థి (BRSV) మరియు నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకోవడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన‌ హామీ హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. అలాగే అదుపులోకి తీసుకున్న నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ క్యాలెండర్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిరసనకారులు డిమాండ...
Anganwadi | అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త
Hyderabad, State

Anganwadi | అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త

ప్రమోషన్ గరిష్ట వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంపు అంగన్వాడీ హెల్పర్ల (Anganwadi Helpers) కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి (Promotion) పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) గురువారం సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడుతుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్లీ చాన్స్ లభించనుంది. Anganwadi హెల్పర్స్ యూనియన్స్ వినతి మేరకు.. గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్వాడీ హెల్పర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యసాధ్య...
Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ
warangal, State

Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ

వివాదాల నడుమ కీలక పరిణామం 16 పేజీల నివేదికతో మీనాక్షి నటరాజన్‌ను కలుసిన సురేఖ Warangal News | కొండా మురళి.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ గా చేసిన విమర్శలు కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా ఆయ‌న‌ విమర్శించారు. దీంతో ఆయా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే గురువారం తన సతీమణి, మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తో కలిసి కొండా ముర‌ళి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan) తో భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అలాగే మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ అంద‌జేశారు. Kond...
error: Content is protected !!