Sarkar Live

State

Heavy Rains | అల‌ర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వ‌ర్షాలు
State

Heavy Rains | అల‌ర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వ‌ర్షాలు

Rain Alert | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్ ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశ ఉన్న‌ట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. బుధవారం భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌...
పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన  – Ration Cards
State, Hyderabad

పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన – Ration Cards

హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల (Ration Cards) పంపిణీకి తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అమేరకు అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ కార్డులు అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో కలిపి 11.3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్‌ అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం మ...
Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు
Hyderabad, State

Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు

Hyderabad | ప్రజాభవన్‌లో శ‌నివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 151 మండల మహిళా సంఘాల బస్సు యజమానులకు రూ.1.05 కోట్ల చెక్కులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హాల‌క్ష్మి ఉచిత బ‌స్సు ( Free Bus scheme) ప‌థ‌కంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన "మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం" విజయవంతమవుతోంద‌న్నారు. అంతకుముందు మహిళా రచయితలు, కవులు రచించిన "మహా లక్ష్మి – మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు" అనే పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళల ప్రయాణ అనుభవాలను కవిత్వం రూపంలో చదివి వినిపించారు. ఈసంద‌ర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “ఒక్క చేతి గుర్తు చూపితే చాలు.. బస్సు ముంగిట నిలుస్తుంది.ఇది మహిళలకు సమానత్వం మీద ముందడుగు.” అని అన్నారు. ఇప్పటివరకు ప్రభ...
ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
Crime, Adilabad

ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు శుక్ర‌వారం ఆకస్మిక దాడులు నిర్వహించారు కోటిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ రైతు వ‌ద్ద నుంచి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ ఆకిరెడ్డి నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవల ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. .. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2025 జూన్ లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్ల‌డించింది. ఈమేర‌కు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్ర‌క‌టించింది. ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్...
జాబ్ క్యాలెండ‌ర్ కోసం ఉద్యమానికి పిలుపు.. BRSV నేతల అరెస్టులతో తీవ్ర‌ ఉద్రిక్తత
Hyderabad, State

జాబ్ క్యాలెండ‌ర్ కోసం ఉద్యమానికి పిలుపు.. BRSV నేతల అరెస్టులతో తీవ్ర‌ ఉద్రిక్తత

BRSV Protest in Hyderabad : రాష్ట్రంలో ఉద్యోగ నియామ‌కాల‌ను చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ యువత చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసనకు ముందు రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. BRS విద్యార్థి విభాగం (BRSV) నాయ‌కులు , నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో వివాదాస్పద పరిస్థితులు తలెత్తాయి. ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ 'చలో సెక్రటేరియట్' నిరసనకు ముందు భారత రాష్ట్ర సమితి విద్యార్థి (BRSV) మరియు నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకోవడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన‌ హామీ హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. అలాగే అదుపులోకి తీసుకున్న నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ క్యాలెండర్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిరసనకారులు డిమాండ...
error: Content is protected !!