Hyderabad : పొన్నం ప్రభాకర్ vs అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం కొలిక్కి వస్తుందా?
Hyderabad : తెలంగాణ కాంగ్రెస్లో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన క్రమంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అల్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదముందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం Hyderabad నార్సింగి (Narsingi)లోని ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి మంత్రులు అడ్లూరితో పాటు పొన్నంను ఆహ్వానించారు. మరోవైపు పొన్నం తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి అడ్లూరి పట్టుబడుతుండగా.. తాను ఆ మాటలను అడ్లూరిని అనలేదని పొన్నం చెబుతున్నారు. మరోవైపు ఏఐసీసీ ఇంచార్...




