Sarkar Live

State

Hyderabad : పొన్నం ప్రభాకర్ vs అడ్లూరి లక్ష్మణ్ మ‌ధ్య‌ వివాదం కొలిక్కి వ‌స్తుందా?
State, Karimnagar

Hyderabad : పొన్నం ప్రభాకర్ vs అడ్లూరి లక్ష్మణ్ మ‌ధ్య‌ వివాదం కొలిక్కి వ‌స్తుందా?

Hyderabad : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన క్ర‌మంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అల్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మాట‌ల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉప ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ వేళ‌ పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకునే ప్ర‌మాద‌ముంద‌ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం Hyderabad నార్సింగి (Narsingi)లోని ఆయన నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేసి మంత్రులు అడ్లూరితో పాటు పొన్నంను ఆహ్వానించారు. మరోవైపు పొన్నం తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి అడ్లూరి పట్టుబడుతుండగా.. తాను ఆ మాటలను అడ్లూరిని అనలేదని పొన్నం చెబుతున్నారు. మ‌రోవైపు ఏఐసీసీ ఇంచార్...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election

Jubilee Hills bye-election | ముఖ్య ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ నిర్వహించ‌నున్న‌ట్టు రాష్ట్ర‌ ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి అన్నారు. తొలిసారిగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (Jubilee Hills bye-election)షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో, ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమ‌య్యారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల సంఘం చేప‌ట్ట‌నున్న చ‌ర్య‌ల‌ను ఆయా పార్టీల నేత‌ల‌కు వివ‌రించారు. కొత్త సంస్క‌ర‌ణ‌లు ఇవీ.. ఒక్కో...
బస్సు ఛార్జీల పెంపుపై BRS ఎమ్మెల్యేల వినూత్న నిర‌స‌న‌
Hyderabad, State

బస్సు ఛార్జీల పెంపుపై BRS ఎమ్మెల్యేల వినూత్న నిర‌స‌న‌

Hyderabad | RTC ఛార్జీల పెంపును నిరసిస్తూ, BRS ఎమ్మెల్యేలు వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. ఎమ్మెల్యేలు డి. సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీకి సిటీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులపై ఆర్థిక భారం మోపే ఆలోచ‌న‌లు మానుకోవాల‌ని, వెంట‌నే బ‌స్సు చార్జీల‌ను త‌గ్గించాల‌ని వారు డిమాండ్ చేశారు. బ‌స్సులో ప్ర‌యాణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాణికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కాగా ప‌లువురు ప్ర‌యాణికులు చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ పెంపుదల రోజువారీ ప్రయాణికులపై నెలకు రూ. 400-500 అదనపు భారం ప‌డుతోంద‌ని అన్నారు. ప్రభుత్వం పేదలపై భారం మోపుతోందని, సేవలను మెరుగుపరచడంలో విఫలమైందని చాలా మంది ఆరోపించారు. అసెంబ్లీ సమీపంలో దిగిన తర్వాత, BRS శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్...
BC Reservations : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
Hyderabad, State

BC Reservations : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కల్పించింది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు హైకోర్టులో ఇప్పటికే విచారణలో ఉందని, అదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం పెంపుపై పిటిష‌న‌ర్‌ వంగా గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా, “హైకోర్టులో కేసు కొనసాగుతుండగా ఇక్కడకు ఎందుకు వచ్చారు?” అని ధర్మాసనం పిటిషనర్‌ తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీనికి ప్రతిగా ఆయన “హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది” అని సమాధానమిచ్చారు. ఆపై ధర్మాసనం, “అక్కడ స్టే నిరాకరించి...
Harish Rao | “రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్ను విధించుడు తప్ప కొత్తదేమీ లేదు”
State, Nizamabad

Harish Rao | “రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్ను విధించుడు తప్ప కొత్తదేమీ లేదు”

Nizamabad | రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి ప‌న్నులు విధించుడు త‌ప్ప‌న ఇంకేమీ లేద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) విమ‌ర్శించారు.ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ మళ్లీ భూముల ధరలు పడిపోయాయని తెలిపారు. బీర్ల ధరలు, విస్కీ ధరలు పెంచించార‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఫ్రీ బస్సు ఇచ్చి మొగోళ్లకు డబల్ టికెట్ కొడుతున్నారని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను బంద్ చేశాడు.నూట్రిషన్ కిట్టు బందు.. కేసీఆర్ కిట్టు బందు.. బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయ‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ ఉండంగా ఎట్ల ఇచ్చిండు.. రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ చేసిండు అని ప్రశ్నించారు. రేవంత...
error: Content is protected !!