Sarkar Live

State

Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
State, Hyderabad

Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert | తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని చెప్పింది. కాగా గత 24గంటల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, వరంగల్‌, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా త...
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట
warangal, State

Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట

‌హనుమకొండ : ‌క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డిపై బెదిరింపు కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్‌ ‌విధించారు. దీంతో పోలీసులు కౌశిక్‌ ‌రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు. అయితే అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్‌ ‌దగ్గర హైడ్రామా కొనసాగింది. క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్‌ ‌తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్‌ ‌లీగల్‌ ‌టీం వాధించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ ‌లాయర్‌ ‌వాదించారు. 308 సెక్షన్‌ 4‌ని తర్వాత మార్ప్ ‌చేయడంతో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌కేసుగా మార్చారని లీగల్‌ ‌టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌ...
Konda Murali | సంచలనం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు
warangal, State

Konda Murali | సంచలనం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై పరోక్ష విమర్శలు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు టిడిపిని బ్రష్టు పట్టించాడు.. కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరాడని ఓ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు పరకాలలో పోటీ చేసిన వ్యక్తి తన కాళ్ళు పట్టుకున్నాడని, ఈసారి తన కూతురు రాజకీయ అరంగ్రేటం చేయనుందని స్పష్టం చేసిన మాస్ లీడర్ సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా మురళీ (Konda Murali) మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు ఓరుగల్లు లో హాట్ టాపిక్ గా మారాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ (Rahul Ghandi) జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్టేషన్ ఘనపూర్, పరకాల ఎమ్మెల్యే లపై పరోక్షంగా ఘాటువ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలం టిడిపి లో పదవులు అను...
గుడ్ న్యూస్.. కాజీపేట, కాచిగూడ నుంచి రిషికేశ్‌కు ప్రత్యేక రైలు -SCR
State, warangal

గుడ్ న్యూస్.. కాజీపేట, కాచిగూడ నుంచి రిషికేశ్‌కు ప్రత్యేక రైలు -SCR

SCR Special Train | ప్రయాణికులకు దక్షిణ మధ్య (SCR) రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. యశ్వంత్‌పూర్‌-యోగ్‌ నగరి రిషికేశ్‌ (06597)కు ప్రతీ గురువారం రైలు ప్రయాణికులకు సేవలందిస్తుందని తెలిపింది. ఈ రైలు గురువారం ఉదయం 7 గంటలకు రిషికేశ్‌లో బయలుదేరి ఆదివారం గమ్యస్థానం చేరుతుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 8.50 గంటలకు.. కాజీపేటలో 11.33 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రిషికేశ్‌-యశ్వంత్‌పూర్‌ (06598) రైలు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రైలు రెండు మార్గాల్లో యెలహంక జంక్షన్‌, హిందుపూర్‌, ధర్మవరం, అనంతపురం, డోన్‌, కర్నూల్‌ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లర్షా, నాగ్‌పూర్‌, భోపాల్‌, బినా జంక్షన్‌, ఝాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రా కాంట్‌...
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
State, Hyderabad

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case ) సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ నాయకులు, ముఖ్య పార్టీల నేతలు, అనుచరుల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసినట్టు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ (SIT Investigation) చేస్తుండగా తాజా సమాచారం ప్రకారం 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు, వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌ ‌చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో 4,200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ‌చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ‌ప్రభాకర్‌ ‌రావు (Prabhakar Rao) పై ఆరోపణలు వచ్చాయి. 2023 నవంబర్‌ 15 ‌నుంచి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్‌ ‌చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుల...
error: Content is protected !!