విషాదం.. కశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం | India Pakistan War
India Pakistan War : భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీనాయక్ (Jawan Murali Nayak) స్వస్థలం సత్యసాయి జిల్లా, జిల్లా గోరంట్ల మండలం జిల్లా కల్లి తండా. మురళీనాయక్ యుద్దంలో మరణించినట్టు భారత ఆర్మీ ప్రకటించింది. శనివారం మురళీ నాయక్ పార్ధీవ దేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు. వీర జవాన్ మురళీనాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివాడు.
సీఎం చంద్రబాబు నివాళి
దేశ రక్షణలో అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఘనంగా నివాళులర్పించారు. పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ‘దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు ని...




