Sarkar Live

State

2025 Delhi polls | ఆప్-కాంగ్రెస్ కూటమిపై ఊహాగానాలకు తెర… పొత్తుపై కేజ్రీవాల్‌
State

2025 Delhi polls | ఆప్-కాంగ్రెస్ కూటమిపై ఊహాగానాలకు తెర… పొత్తుపై కేజ్రీవాల్‌

2025 Delhi polls : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు ఉండ‌బోతోంద‌ని కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌, ఆమ్ఆద్మీ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ఇత‌ర రాజ‌కీయ ప‌క్షాల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న దృష్ట్యా ఈ రెండు పార్టీల అధినాయ‌కత్వాలు చేసే ప్ర‌క‌ట‌న ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి స‌ర్వత్రా వ్య‌క్త‌మైంది. అయితే.. దీనిపై ఎట్ట‌కేల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రెండు పార్టీల పొత్తు విష‌యంలో ఊహాగానాలకు తెర‌ప‌డింది. ఎక్స్‌వేదిక‌గా కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) ఈ ఊహాగానాలకు తెర‌దింపారు. రెండు పార్టీల మ‌ధ్య అల‌యెన్స్ ఉండ‌బోతుంద‌నే అంశంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. "ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మేం ఒంట‌రిగానే పోటీ చేస్తాం. ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండ...
Sankranti Special Trains : సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేక రైళ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..
State

Sankranti Special Trains : సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేక రైళ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

Sankranti Special Trains : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ స‌మ‌యంలో రైళ్లలో రద్దీ విప‌రీతంగా ఉంటుంది. ఈ రద్దీని తగ్గించేందుకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. దీంతో సంక్రాంతి ప్రయాణ ఇబ్బందులు తీర‌నున్నాయి. ఆ ప్ర‌త్యేక‌ రైళ్ల వివరాలు ఇవీ.. సికింద్రాబాద్, విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు.. సంక్రాంతి పండుగ‌ సందర్భంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. 07097, 07098 నంబర్లతో ఈ ట్రైన్ ప్రతీ ఆది, సోమవారాల్లో అందుబాటులో ఉండనుంది. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఇది సికింద్రాబాద్ స్టేష‌న్‌ లో బయలుదేరుతుంది. వైజాగ్‌ నుండి సోమ వారాల్లో సాయంత్రం 7.50 గంటలకు స్టార్ట్ అయి త‌రువాత‌ రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ రైలు నల్ల‌గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ...
No Confidence motion | అవిశ్వాసం నెగ్గేనా.. ఇండియా కూటమికి పెను స‌వాళ్లు!
State

No Confidence motion | అవిశ్వాసం నెగ్గేనా.. ఇండియా కూటమికి పెను స‌వాళ్లు!

No Confidence motion : రాజ్య‌స‌భ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankar)పై అవిశ్వాస తీర్మానికి ఇండియా (INDIA) కూట‌మి సిద్ధ‌మైంది. స‌భ‌ను స‌జావుగా సాగ‌నివ్వ‌డం లేద‌ని విప‌క్షాల‌పై జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప‌లుమార్లు మందలించ‌డంతో ఆయ‌న‌పై ఇండియా కూట‌మి ఎంపీలు గుర్రుగా ఉన్నారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హరించాల్సిన ఆయ‌న వైఖ‌రి అధికార ప‌క్షానికి అనుకూలంగా ఉందని, విప‌క్షాల ప‌ట్ల వివ‌క్ష చూపుతున్నార‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌. స‌భ‌లో తమను మాట్లాడ‌నివ్వ‌కుండా చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ అడ్డుకుంటున్నార‌ని ఇండియా కూట‌మి ఎంపీలు విమ‌ర్శిస్తున్నారు. నోటీసు ఇచ్చిన ఇండియా కూట‌మి చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఇండియా కూట‌మి నోటీసు ఇచ్చింది. అయితే అవిశ్వాసానికి 50 మంది ఎంపీల మద్దతు అవసరం. 71 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానికి మ‌ద్ద‌తుగా సంతకాలు చేశార‌ని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇ...
నేతన్నలకు స‌ర్కారు గుడ్ న్యూస్ త్వరలోనే చేనేత రుణమాఫీ
State

నేతన్నలకు స‌ర్కారు గుడ్ న్యూస్ త్వరలోనే చేనేత రుణమాఫీ

Hyderabad | తెలంగాణలోని నేతన్నలకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో చేనేత రంగం (Handlooms ) సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Minister Thummala Nageshwar Rao) ప్ర‌క‌టించారు. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకూ రుణమాఫీ అమ‌లుచేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే చేనేత రుణమాఫీ చేస్తామన్నారు. చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రభుత్వశాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాల‌ని మంత్రి సూచించారు. ప్రైవేట్ సంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేనేత, జౌళి శాఖకు సంబంధించిన బకాయిలను చెల్లించలేదు. దీంతో ఆ భారం మా ప్రభుత్వంపై...
Govt Schools | పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలను ప్ర‌ద‌ర్శించాల్సిందే..
State

Govt Schools | పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలను ప్ర‌ద‌ర్శించాల్సిందే..

Teachers Photos in Govt Schools |తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న టీచ‌ర్ల ఫొటోలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని.. పాఠశాల విద్యాశాఖ ఉత్వ‌ర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెంట‌నే చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలిచ్చారు. కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయులకు బ‌దులు ఇతర ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నానే విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, ఈ విష‌య‌మై విద్యాశాఖకు పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయని నరసింహారెడ్డి వెల్ల‌డించారు. ఇలా ఒకరికి బ‌దులు మరొకరు పనిచేస్తున్నట్లు నిర్ధార‌ణ అయితే వెంట‌నే కఠిన చర్యలు ...
error: Content is protected !!