Sarkar Live

warangal

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు
State, warangal

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు

Medaram Jatara 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara 2026) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు బుధవారం ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది.  రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు.  జ‌న‌వ‌రి 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కీల‌క‌మైన ఘ‌ట్టం ఉంటుంది. ఇక 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో  వెల్లడించారు....
NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
warangal, State

NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

– సీతక్క చేతుల మీదుగా ఘన సత్కారం Mulugu : సీనియర్ జర్నలిస్ట్‌, రచయిత గడ్డం కేశవమూర్తికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటసార్వభౌముడు, సంచలన రాజకీయ నేత పద్మశ్రీ డా.ఎన్టీ రామారావు స్మారకంగా ఇచ్చే ఎన్టీఆర్ అవార్డు (NTR Award ) ఈసారి కేశవమూర్తికి అందింది. ఈ అవార్డును విజయవాడకు చెందిన 'ఎక్స్ రే సాహిత్య-సాంస్కృతిక సేవా సంస్థ' ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందజేసింది. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు కేశవమూర్తి (Gaddam Keshava Murthi) ని కూడా పురస్కరించడం విశేషం. గురువారం ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క (Minister Seethakka) స్వయంగా కేశవమూర్తికి అవార్డును అందించారు. ఆమె చేతుల మీదుగా శాలువాతో కేశవమూర్తిని ఘనంగ సపన, మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజ...
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట
warangal, State

Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట

‌హనుమకొండ : ‌క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డిపై బెదిరింపు కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్‌ ‌విధించారు. దీంతో పోలీసులు కౌశిక్‌ ‌రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు. అయితే అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్‌ ‌దగ్గర హైడ్రామా కొనసాగింది. క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్‌ ‌తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్‌ ‌లీగల్‌ ‌టీం వాధించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ ‌లాయర్‌ ‌వాదించారు. 308 సెక్షన్‌ 4‌ని తర్వాత మార్ప్ ‌చేయడంతో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌కేసుగా మార్చారని లీగల్‌ ‌టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌ...
Konda Murali | సంచలనం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు
warangal, State

Konda Murali | సంచలనం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై పరోక్ష విమర్శలు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు టిడిపిని బ్రష్టు పట్టించాడు.. కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరాడని ఓ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు పరకాలలో పోటీ చేసిన వ్యక్తి తన కాళ్ళు పట్టుకున్నాడని, ఈసారి తన కూతురు రాజకీయ అరంగ్రేటం చేయనుందని స్పష్టం చేసిన మాస్ లీడర్ సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా మురళీ (Konda Murali) మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు ఓరుగల్లు లో హాట్ టాపిక్ గా మారాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ (Rahul Ghandi) జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్టేషన్ ఘనపూర్, పరకాల ఎమ్మెల్యే లపై పరోక్షంగా ఘాటువ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలం టిడిపి లో పదవులు అను...
గుడ్ న్యూస్.. కాజీపేట, కాచిగూడ నుంచి రిషికేశ్‌కు ప్రత్యేక రైలు -SCR
State, warangal

గుడ్ న్యూస్.. కాజీపేట, కాచిగూడ నుంచి రిషికేశ్‌కు ప్రత్యేక రైలు -SCR

SCR Special Train | ప్రయాణికులకు దక్షిణ మధ్య (SCR) రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. యశ్వంత్‌పూర్‌-యోగ్‌ నగరి రిషికేశ్‌ (06597)కు ప్రతీ గురువారం రైలు ప్రయాణికులకు సేవలందిస్తుందని తెలిపింది. ఈ రైలు గురువారం ఉదయం 7 గంటలకు రిషికేశ్‌లో బయలుదేరి ఆదివారం గమ్యస్థానం చేరుతుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 8.50 గంటలకు.. కాజీపేటలో 11.33 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రిషికేశ్‌-యశ్వంత్‌పూర్‌ (06598) రైలు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రైలు రెండు మార్గాల్లో యెలహంక జంక్షన్‌, హిందుపూర్‌, ధర్మవరం, అనంతపురం, డోన్‌, కర్నూల్‌ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లర్షా, నాగ్‌పూర్‌, భోపాల్‌, బినా జంక్షన్‌, ఝాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రా కాంట్‌...
error: Content is protected !!