Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు!
Kancha Gachibowli : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూవివాదం (Kancha Gachibowli issue)పై రాజకీయాలు వేడెక్కాయి. నిండు పచ్చదనం ఉన్న ఈ ప్రదేశంలో వంద ఎకరాల అరణ్యాన్ని ధ్వంసం చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) సహా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ (Congress party)పై విమర్శలు పెరిగాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది.
రాహుల్ గాంధీ మౌనం.. విపక్షాల ఆరోపణలు
ఏఐసీసీ (All India Congress Committee) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, కేసులు నమోదు చేయడం, ఆందోళనలపై ప్రభుత్వ కఠిన వైఖరిపై విమమర్శలు గుప్పుమ...