Mahakumbh Mela 2025 : మహా కుంభమేళా వెళ్లే భక్తులకు చక్కని అవకాశం IRCTC సరికొత్త టూర్..
Mahakumbh Mela 2025 : ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం సంగమం మహాకుంభ మేళాకు కోట్లాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించి తరిస్తున్నారు. ఇప్పటికే ఏడు కోట్ల మంది స్నానాలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కుంభ మేళాకు వెళ్తుండడంతో రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఐఆర్సీటీసీ (IRCTC) తాజాగా ఫిబ్రవరి 15న సికింద్రా బాద్ నుంచి ప్రయాగ్ రాజ్(Prayagraj)కు ప్రత్యేక రైలును ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు కొనసాగే యాత్రా స్పెషల్ ప్యాకేజీ ఇది.
వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా(Mahakumbh Mela 2025)కు వెళ్లే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు 22న మళ్లీ ఇక్కడికి చేరుకుంటుంది. వారం రో...




