Sarkar Live

Trending

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏమిటంటే
Trending

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏమిటంటే

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇది ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో (డిసెంబర్-జనవరి మధ్య) వ‌స్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినం సాధారణంగా మోక్షదా ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశికు సమాంతరంగా వస్తుంది. వైకుంఠ ఏకాదశి అంటే.. ప్రతి నెలా చంద్రమాసంలో కృష్ణ పక్షం, శుక్ల పక్షం రెండింటిలోనూ వచ్చే ఏకాదశి తిథులు విశేషంగా భావించబడతాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో అత్యంత పవిత్రమైన నాలుగు ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం జనవరి 10 (శుక్రవారం) వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్నారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు భక్తులు విశేష పూజలు, ఉపవాసం ద్వారా భగవంతుని ఆశీర్వాదం పొందుతారు. పౌరాణిక ప్రాముఖ్యత. రాసురుని కథ కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలు, సాధువులను హింసిస్తూ భయాందో...
High Court : మ‌హిళ‌ల‌పై కామెంట్ కూడా లైంగిక వేధింపే : కేర‌ళ హైకోర్టు
Trending

High Court : మ‌హిళ‌ల‌పై కామెంట్ కూడా లైంగిక వేధింపే : కేర‌ళ హైకోర్టు

కేరళ హైకోర్టు (Kerala High Court) ఒక సంచ‌ల‌న‌ తీర్పును వెలువ‌రించింది. మహిళ శరీర నిర్మాణంపై వ్యాఖ్య చేయడం కూడా నేర‌మే అవుతుంద‌ని పేర్కొంది. ఇది లైంగిక వేధింపు (Sexual Harassment) కిందికే వ‌స్తుంద‌ని తేల్చి చెప్పింది. ఒక కేసులో న్యాయమూర్తి ఎ.బ‌ద‌రుద్దీన్ (Justice A Badaruddin) ఈ తీర్పును వెలువ‌రించారు. తనపై నమోదైన లైంగిక వేధింపు కేసును ర‌ద్దు చేయ‌మ‌ని కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (KSEB) ఉద్యోగి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు తిరస్క‌రించింది. ఒక మ‌హిళ శ‌రీర నిర్మాణంపై కామెంట్ చేయ‌డం సెక్స్ ఉద్దేశంతో ముడిప‌డి ఉంటుంద‌ని, ఇది కూడా లైంగిక వేధింపు కిందికే వ‌స్తుంద‌ని న్యాయమూర్తి తీర్చు చెప్పారు. కేసు పూర్వ‌ప‌రాలు కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో ప‌నిచేసే త‌న స‌హోద్యోగి త‌న శరీర నిర్మాణంపై అస‌భ్య‌క‌రంగా మాట్లాడాడ‌ని అదే సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఓ మ‌హిళా ఉద్యోగి పోలీసుస్టేష‌న్‌లో గ‌తంలో ఫ...
Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..
Trending

Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | అది ఒక‌ ఆద‌ర్శ గ్రామం. ఆ పంచాయ‌తీ తీసుకొనే నిర్ణ‌యాలు వినూత్నం.. స్ఫూర్తిదాయకం. అక్క‌డి ప్ర‌జ‌లందరిదీ ఒకే బాట‌. అంద‌రూ ఒకే మాట‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. పంచాయ‌తీ నియ‌మాల‌ను అనుస‌రించాల్సిందే. వీటిని పాటించి బ‌హుమ‌తి కొట్టాల్సిందే. పంజాబ్ రాష్ట్రం బ‌ఠిండా జిల్లా (Punjab's Bathinda district)లోని బ‌ల్లో (Ballo Village) గ్రామ పంచాయ‌తీ ఈ త‌ర‌హా ఆద‌ర్శ నిర్ణ‌యాలు తీసుకుంటోంది. త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను స‌న్మార్గంలో న‌డిపిస్తూ ఆ ప‌ల్లెను ప్ర‌గ‌తి ప‌థం వైపు తీసుకెళ్తోంది. వినూత్న ప్రోత్సాహం ఇప్ప‌టికే అనేక వినూత్న నిర్ణ‌యాల‌తో గ్రామాన్ని ఆద‌ర్శ‌ప్రాయంగా మారుస్తున్న బ‌ల్లో పంచాయ‌తీ.. తాజాగా మ‌రో కార్యాచ‌ర‌ణ‌కు తెర‌తీసింది. అక్క‌డ జ‌రిగే వివాహ వేడుక‌ల్లో డీజే సౌండ్ (DJ music) సిస్టం వినియోగం, మ‌ద్యాన్ని(liquor ) నిషేధించింది. ఈ నిబంధ‌న‌కు ఎంత‌టి వారైనా క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. దీన్ని ...
Hottest Year | అత్యంత వేడైన సంవత్సరం 2024.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు
Trending

Hottest Year | అత్యంత వేడైన సంవత్సరం 2024.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు

Temperature : భార‌త‌దేశం 2024లో అధిక ఉష్ణోగ్ర‌త‌ (Hottest Year 2024) ను చ‌విచూసింద‌ని వాతావ‌ర‌ణ విభాగం (IMD) వెల్ల‌డించింది. అధిక ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డం 121 త‌ర్వాత ఇదే మొద‌టిసారి అని తాజాగా ఓ నివేదిక‌ల‌లో వెల్ల‌డించింది. 1901 తర్వాత అధికంగా 0.90 డిగ్రీ సెల్సియస్ న‌మోదైంద‌ని పేర్కొంది. 2024లో సగటు ఉష్ణోగ్రత 25.75 డిగ్రీ సెల్సియస్‌గా ఉంది. ఇది సగటు ఉష్ణోగ్రత కన్నా 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ. Hottest Year : ఏడాదంతా వేడియే.. దేశంలో ఇటీవ‌ల తీవ్ర చలికాలం (winter season) వాతావరణం నెల‌కొంది. అయితే.. ఇది వాస్త‌వం కాద‌ని తెలుస్తోంది. వాతావ‌ర‌ణ శాఖ నివేదిక‌ను ప‌రిశీలిస్తే.. గ‌డిచిన ఏడాదంతా అధిక ఉష్ణోగ్ర‌త‌లే ఉన్నట్టు తెలుస్తోంది. 1901 తర్వాత‌ భారత దేశం వాతావరణ చరిత్రలో అత్యంత వేడైన సంవత్సరంగా 2024 న‌మోదు చేసుకుంది. ఈ సంవత్సరం కనిష్ట సగటు ఉష్ణోగ్రత 1901 తర్వాత 0.90 డిగ్రీ సెల్సియస్ పెరిగింద...
Punjab Bandh LIVE : స్తంభించిన పంజాబ్.. ఎందుకంటే..
Trending

Punjab Bandh LIVE : స్తంభించిన పంజాబ్.. ఎందుకంటే..

Punjab Bandh LIVE : పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పిస్తూ దాన్ని చట్ట‌బ‌ద్ధ‌త చేయాల‌ని, త‌మ ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సుదీర్ఘకాలంగా పోరాడుతున్న రైతులు త‌మ నిర‌స‌న‌ను మ‌రోరూపంలో వ్య‌క్త‌ప‌రిచారు. తాజాగా పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆ రాష్ట్రంలో ఈ రోజు జ‌న‌జీవ‌నం స్తంభించింది. వ్యాపార‌, వాణిజ్య, రోడ్డు, రైల్వే సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. వ్యాపార వ‌ర్గాల మ‌ద్ద‌తు పంజాబ్ రైతుల బంద్ కార‌ణంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ సంస్థ‌లను మూసివేశారు. ఇది ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఇది కొన‌సాగుతుంద‌ని రైతులు ప్ర‌క‌టించారు. అత్యవసర సేవలు యథావిధిగా ఉంటాయ‌న్నారు. సాయంత్రం వరకు పాల, పండ్లు, కూరగాయల సరఫరా ఉండదని, ఆ వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. అంబులెన్స్‌లు, ఇత‌ర అత్యవ‌స‌ర వాహనాలను అనుమ‌తిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు మాత్ర...
error: Content is protected !!