Sarkar Live

Privacy Policy

Cash RainViral Video | డ‌బ్బుల వ‌ర్షం కురిపించిన‌ కోతి..
Viral

Cash RainViral Video | డ‌బ్బుల వ‌ర్షం కురిపించిన‌ కోతి..

Cash Rain | ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో బిధునా తహసీల్ ప్రాంగణంలో ఒక కోతి "డబ్బుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. నివేదికల ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో దొండాపూర్ గ్రామానికి చెందిన రోహితాష్ చంద్ర తన భూమి పత్రాలను రిజిస్ట్రేష‌న్ చేసుకోవడానికి తహసీల్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి అనుజ్ కుమార్ తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి వచ్చాడు. వారు మోపెడ్ లోని స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్ లోపల రూ.80,000 నగదును ఉంచారు. రోహితాష్ తన న్యాయవాదితో పేప‌ర్ వ‌ర్క్ లో నిమగ్నమై ఉండగా, ఒక కోతి వాహనంలో దాచిన నగదు బ్యాగ్ ను లాక్కొని పారిపోయింది. ఒక కోతి మోటార్ సైకిల్ నిల్వ కంపార్ట్‌మెంట్ తెరిచి, నగదు బ్యాగ్‌ను లాక్కొని, ఆ ప్రాంగణంలోని ఒక చెట్టుపైకి ఎక్కింది. కొద్దిసేపటి తర్వాత, కోతి కరెన్సీ...
Kamareddy | భారీ వ‌ర్షాలు.. కామారెడ్డిలో కొట్టుకుపోయిన వాహ‌నాలు
Nizamabad, State

Kamareddy | భారీ వ‌ర్షాలు.. కామారెడ్డిలో కొట్టుకుపోయిన వాహ‌నాలు

Kamareddy News | కామారెడ్డి : ఉమ్మ‌డి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయి మ‌త్త‌డి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్ర‌హిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది. జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుతో నిండిపోయింది. అనేక కాలనీలో జలమయమై కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోవ‌డంతో ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద నీరు చేరడంతో అక్క‌డివారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. కామారెడ్డి పెద్ద చెరువు ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడు చూడ‌ని విధంగా భూమికి సమాంతరంగా పెద్ద చెరువు నీళ్లు పారుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్న...
Tariffs War | ట్రంప్ 50% సుంకాల రికవరీ నేటి నుండి ప్రారంభం.. ఏ రంగం ఎక్కువగా దెబ్బతింటుంది?
World

Tariffs War | ట్రంప్ 50% సుంకాల రికవరీ నేటి నుండి ప్రారంభం.. ఏ రంగం ఎక్కువగా దెబ్బతింటుంది?

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత వస్తువులపై 50% సుంకం (Tariffs) విధించారు. ఇది నేటి నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా ఇప్పటికే భారత వస్తువులపై 25% సుంకం విధిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అదనంగా 25% సుంకం విధించింది. వీటి సేకరణ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశ దాదాపు $48.2 బిలియన్ల ఎగుమతులను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు ఎక్కువగా దెబ్బ‌తినే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వీటిలో వస్త్రాలు (Textile Industry), రొయ్యలు, తోలు, వజ్రాలు, ఆభరణాలు, తివాచీలు, ఫర్నిచర్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. ఈ వస్తువుల ఎగుమతి (Indian Exports) ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈ సుంకం మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులపై ఎటువంటి ప్రభావం చూపదు. ట్రంప్ సుంకం కారణంగా, అమెరికాకు ఎగుమతుల విలువ గత సంవ...
Landslide | జమ్మూలో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి
National

Landslide | జమ్మూలో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి

Landslide in Jammu Kashmir | జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రాలో మాతా వైష్ణో దేవి యాత్ర ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడటం (Landslide) తో బుధ‌వారం ఉద‌యం 30 మంది మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు. జమ్మూ కాశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలు ఉదృత‌మ‌వ‌డంతో కొండచరియలు విరిగిపడిపోతున్నాయి. జమ్మూలో, కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, వంతెనలు కూలిపోయాయి, విద్యుత్ లైన్లు మొబైల్ టవర్లు కూలిపోయాయి. మంగళవారం ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య జమ్మూలో అత్యధిక వర్షపాతం నమోదైంది, అధికారిక సమాచారం ప్రకారం కేవలం ఆరు గంటల్లోనే 22 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అయితే, అర్ధరాత్రి తర్వాత వర్షపాతం తగ్గడంతో కొంత ఉపశమనం కలిగించింది. అంతకుముందు, మంగళవారం మధ్యాహ్నం పుణ్యక్షేత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్...
Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం
Crime, Mahaboobnagar

Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం

Mahbubnagar | కూతురికి రేబిస్ (Rabies) సోకిందన్న అనుమానంతో ఓ మ‌హిళ త‌న‌ కూతురిని చంపి, ఆపై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. యశోద అనే గృహిణికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రేబిస్‌ వ్యాధి సోకుతుందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోయి తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్ప‌డింది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు.. కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్త..! అంటూ యశోద చాక్ బోర్డు, డోర్ల మీద రాసింది. రేబిస్ వాక్సిన్ (Rabies Vaccine) తీసుకున్నప్పటికీ.. అది వ్యాక్సిన్‌తో తగ్గదు, చెట్ల మందు తీసుకోవాలి, పత్యం చేయాలని భర్త నరేష్‌కు పలు రకాలుగా విన్నవించింది. తనకు, తన కూతురుకి రేబిస్ వ్యాధి సోకింద‌ని అందోళన చెందింది. అదే అనుమానంతో వ్యాక్సిన్ సైతం తీసుకుంది....
error: Content is protected !!