Sarkar Live

Privacy Policy

Viral Video | సెల్ఫీ తీస్తాన‌ని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య ? వీడియో వైరల్.. చూడండి
Viral

Viral Video | సెల్ఫీ తీస్తాన‌ని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య ? వీడియో వైరల్.. చూడండి

Mahaboob Nagar Viral Video | : సెల్ఫీ తీసుకునే నెపంతో ఓ భార్య‌ తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసిన ఘటన శనివారం క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని కడ్లూర్ గ్రామంలోని కృష్ణా నదిపై ఉన్న వంతెన దగ్గరకు తాతప్ప, అతడి భార్య వ‌చ్చారు. ఈ వంతెన తెలంగాణలోని నారాయణపేట జిల్లాతో సరిహద్దులో ఉంటుంది. వంతెన వద్దకు చేరుకున్న తర్వాత, తాతప్ప, అతని భార్య మొబైల్‌లో కొన్ని ఫోటోలు తీశారు. సెల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు, భర్త ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడిపోయాడు . తాతప్ప ఈదుకుంటూ నదిలో ఉన్న ఒక బండరాయిని పట్టుకోగలిగాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తాడుతో అతన్ని రక్షించారు. ఊపిరి పీల్చుకున్న తర్వాత, తాతప్ప తన భార్య తనను ఉద్దేశపూర్వకంగా నదిలోకి తోసిందని ఆరోపించాడు. ఆ జంట అక్కడికక్కడే గొడవ పడుతుండగా, స్థానికులు వారిని శాంతింపజేసి వారి తల్లిదండ్రులకు ఫోన్ చే...
Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
Khammmam, State

Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు

Bhadradri Kothagudem : నక్సలిజం హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని ఆరుగురు మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ముందు శనివారం లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసు సూపరింటెండెంట్ బి.రోహిత్ రాజు మాట్లాడుతూ, పోలీసు శాఖ "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం కింద గిరిజనుల కోసం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి తెలుసుకున్న తర్వాత మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, కంపెనీ/ప్లాటూన్ కమిటీ (DVCM/CYPC), ఇద్దరు ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు (PPCM), ఏరియా కమిటీ సభ్యులు (ACM), ముగ్గురు పార్టీ సభ్యులు (PMలు) స్వచ్ఛందంగా నక్సలిజం హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాదిలో 300 మంది ...
Baby Girl Sold | ఐదో సంతానంగా ఆడపిల్ల పుట్టిందని అమ్మేసిన తల్లిదండ్రులు
Nizamabad, State

Baby Girl Sold | ఐదో సంతానంగా ఆడపిల్ల పుట్టిందని అమ్మేసిన తల్లిదండ్రులు

రూ.2 లక్షలకు సోలాపూర్‌ వ్యక్తికి విక్రయం Baby Girl Sold : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆడ శిశువును విక్రయించిన ఘటన కలకలం రేపింది. ఐదో సంతానంగా ఆడ శిశువు పుట్టిందని, తాము పోషించలేమని స్వ‌యంగా తల్లిదండ్రులే విక్ర‌యించారు. రెండు లక్షల రూపాయలకు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వ్యక్తిలో బేరం కుదుర్చుకొని అమ్మినట్టు స‌మాచారం. ముత్యాలమ్మ, వెంకట్రావు అనే దంపతులకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. ఐదో సంతానంగా పుట్టిన ఆడ శిశువును అమినట్లు స్థానికులకు అనుమానం రావ‌డంతో వెంట‌నే వారు చైల్డ్‌లైన్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో అధికార యంత్రాంగం వెంట‌నే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ మొద‌లు పెట్టింది. కాగా శిశు విక్ర‌యంపై మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన‌ట్లు నిజామాబాద్‌ పోలీసులు వెల్ల‌డించారు. అమ్ముడైన శిశువును అధికారులు తిరిగి చేర‌దీసి బాలల‌ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆడపిల్లలను పోషించలేమ...
Victory Venkatesh | వెంకీ జోరు మాములుగా లేదు – త్రివిక్రమ్, దృశ్యం 3, బాలయ్య మూవీతో ఫుల్ బిజీ
Cinema

Victory Venkatesh | వెంకీ జోరు మాములుగా లేదు – త్రివిక్రమ్, దృశ్యం 3, బాలయ్య మూవీతో ఫుల్ బిజీ

సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీతో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh)బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మంచి జోరు మీద ఉన్నాడు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సీనియర్ హీరోల్లో 300 కోట్ల క్లబ్బులో చేరి హిస్టరీ క్రియేట్ చేశాడు. అదే జోష్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)సినిమాకు రెడీ అవుతున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కబోయే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి వర్క్ చేసి సూపర్ రైటర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఈ సారి మెగా ఫోన్ తో వెంకీ కి బ్లాక్ బస్టర్ హిట్టు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. యమ స్పీడ్ గా మూవీస్ ను లైన్లో పెడుతున్న వెంకీ త్రివిక్రమ్ మూవీని అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా తానా సభలకు హాజరై తన నెక్స్ట్ మూవీ...
 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse
Crime, National

 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse

Delhi Building Collapse : న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో శిథిలాల కింద ప‌లువురు చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. శిథిలాల నుంచి ముగ్గురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప‌లు సంస్థలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. "శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోవచ్చు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. "ఉదయం 7 గంటలకు భవనం కూలిపోయినట్లు మాకు కాల్ వచ్చింది. ఏడు అగ్నిమాపక దళాలు సహా స‌హాయ‌క బృందాలు పనిచేస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని అధికారి తెలిపారు. స్థానికులు ఉదయం నడకకు వెళ్లినప్పుడు భవనం కూలిపోయింది. వీరిలో చాలామంది అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. తరువాత అగ్నిమాపక శాఖ సహాయంతో, ముగ్గురిని రక్షించారు. సీలంప...
error: Content is protected !!