Sarkar Live

Privacy Policy

ACB | తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆపరేటర్
Crime

ACB | తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆపరేటర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ కార్యాలయంలో(టైపిస్ట్ )కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సిహెచ్.నవక్రాంత్ బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టబడ్డాడు. నవక్రాంత్ రేషన్ కార్డ్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి ప్రాసెస్ చేయడానికి రూ.4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రూ.2500 బాధితుల వద్ద నుంచి నవక్రాంత్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telan...
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట
warangal, State

Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట

‌హనుమకొండ : ‌క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డిపై బెదిరింపు కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్‌ ‌విధించారు. దీంతో పోలీసులు కౌశిక్‌ ‌రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు. అయితే అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్‌ ‌దగ్గర హైడ్రామా కొనసాగింది. క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్‌ ‌తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్‌ ‌లీగల్‌ ‌టీం వాధించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ ‌లాయర్‌ ‌వాదించారు. 308 సెక్షన్‌ 4‌ని తర్వాత మార్ప్ ‌చేయడంతో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌కేసుగా మార్చారని లీగల్‌ ‌టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌ...
PM Awas Yojana : ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదటి విడత విడుదల
National

PM Awas Yojana : ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదటి విడత విడుదల

అర్హత, దరఖాస్తు ప్రక్రియ మరియు ప్రయోజనాలను తెలుసుకోండి. PM Awas Yojana : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లోని సివాన్ నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) కింద 53,600 మందికి పైగా లబ్ధిదారులకు మొదటి విడతను విడుదల చేశారు. ఈ సందర్భంగా, ప్రతి పేదవాడికి కాంక్రీట్ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ పథకం ఆ దిశలో ఒక బలమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు. PM Awas Yojana పథకం లక్ష్యం ఏమిటి? ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) అనేది ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), తక్కువ ఆదాయ వర్గాలు (LIG), ఇతర వెనుకబడిన వర్గాలకు పక్కా గృహాలను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప్రణాళికలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. పట్టణ పేదల కోసం PMAY-అర్బన్ (PMAY-U) గ్రామీణ ప్రాంతాల పేద‌ల కోసం PMAY-గ్రామీణ్ (PMAY-G) PMAY-U కి అర్హత దరఖాస్తుదారునికి భారతదేశంలో శాశ్వత ఇల్లు...
MVI | ఎంవీఐల ద్విపాత్రాభినయం:
Special Stories

MVI | ఎంవీఐల ద్విపాత్రాభినయం:

ఆర్టీఓలు లేకపోవడంతో రవాణా శాఖ గాడితప్పుతున్నదా? రాష్ట్రంలో సగానికి పైగా రవాణా శాఖ కార్యాలయాల్లో "ఆర్టీఓ"ల కొరత ఆర్టీఓ లను నియమించేదెన్నడు..? ఈ శాఖను గాడిలో పెట్టేదెప్పుడు.. రవాణా శాఖ (Telangana Transport Department) లో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (MVI)లు డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో ఆర్టీఓ ల కొరత కారణంగా ఒక్కో అధికారి రెండేసి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో సగానికి పైగా "ఆర్టీఓ"లు లేరని దాంతో కార్యాలయాల్లోని ఎంవీఐ లకే "డిటివో" లుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో ఎంవీఐ లకు అదనపు భారం పడుతున్నట్లు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాపోతున్నారు.కొంతమంది ఇలా భాధపడితే మరికొంతమంది ఇదే అదునుగా డబుల్ బొనాంజా( ఎంవీఐ కమ్ డిటివో ప్రకారం రోజు వారి అక్రమ వసూళ్లు) పొందుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయ...
IRCTC ‘పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర’ రైలు
National

IRCTC ‘పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర’ రైలు

హైదరాబాద్ : ఐఆర్‌సిటిసి (IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.! 'పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర' (AMBEDKAR YATRA WITH PANCH(05) JYOTIRLINGA DARSHAN) పేరిట ఒక ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Train) ను తాజాగా ప్రకటించింది. ఈ రైలు జూలై 5న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన యాత్రను ప్రారంభిస్తుంది. ఈ రైలు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం, ఓంకారేశ్వర్, దీక్షా భూమి స్థూపం (డాక్టర్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం) నాగ్‌పూర్‌లోని శ్రీస్వామినారాయణ మందిరం, జన్మభూమి (డా. అంబేద్కర్ జన్మస్థలం) మోవ్, త్రియోత్కర్ బిస్వర్ జ్యియోత్కర్ వద్ద ఉన్న త్రియోత్కర్ వద్ద ప్రయాణిస్తుంది. పూణేలో జ్యోతిర్లింగం ఔరంగాబాద్ వద్ద గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవశాన్ని IRCTC ఈ యాత్రద్వారా కల్పించి...
error: Content is protected !!