Sarkar Live

Privacy Policy

Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం
Hyderabad, State

Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం

Metro Phase 2 : ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మియాపూర్-ఎల్బీనగర్ (29 కి.మీ.), నాగోల్-రాయదుర్గం (29 కి.మీ.), జూబ్లీ బస్‌స్టేషన్-ఎంజీ బస్టాండ్ (11.2 కి.మీ.) రూట్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 69.2 కి.మీ మేర మెట్రో నెట్‌వర్క్ కలిగి ఉన్న ఈ ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం 86.1 కి.మీ మేర మూడుసూత్రాల మెట్రో విస్తరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 19,579 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (50:50 నిష్పత్తిలో) ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. Metro Phase 2 ప్రధాన కారిడార్ల వివరాలు: Metro Phase 2 కారిడార్-1: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఫ్యూచర్ సిటీ (మణికొండ / ORR సమీపం) వరకు 39.6 కి.మీ మేర నిర్మించనున్నారు. ఈ రూట్ ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయానికి...
Kamal Hassan | కన్నడలో థగ్ లైఫ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు…?
Cinema

Kamal Hassan | కన్నడలో థగ్ లైఫ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు…?

కన్నడ భాష పై విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hassan) చేసిన వ్యాఖ్యలు తెగ దుమారం రేపాయి.మణిరత్నం (maniratnam)డైరెక్షన్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కమల్ యాక్ట్ చేసిన థగ్ లైఫ్ (Thug Life) మూవీ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కాగా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ కన్నడ భాష తమిళ్ నుండే పుట్టిందని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని కన్నడ ఫిలిం ఛాంబర్ కోరింది. దీనిపై కమల్ మాట్లాడుతూ నేను సారీ చెప్పను నేను అన్న దాంట్లో తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. దీంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ మూవీపై నిషేధం విధించింది. విడుదల దగ్గరపడుతుండగా కమల్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూవీ రిలీజ్ అయ్యేలా చూడాలని, థియేటర్ల వద్ద ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. కమల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కమల్ ...
Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!
State, warangal

Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!

Oil Palm Factory in Mulugu | ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పంచాయతారాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ‌ మంత్రి డాక్టర్ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు.వెనకబడిన జిల్లా ములుగు పారిశ్రామికీకరణకు క్యాబినెట్ నిర్ణయంతో ముందడుగు పడిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కేబినెట్‌ మంత్రులకు మంత్రి సీతక్క జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆమె చెప్పిన విధంగా, ఈ నిర్ణయం ములుగు జిల్లాకు అభివృద్ధి దిశగా పెద్ద బలాన్నిస్తుంది. ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ (Oil Palm) పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాకు కొత్త ఊపు రానుంది. జిల్లాలో ...
Maoist Sudhakar | మావోయిస్టు అగ్రనేత  ఎన్‌కౌంట‌ర్
Crime

Maoist Sudhakar | మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంట‌ర్

Maoist Sudhakar | మావోయిస్టు పార్టీకి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని రోజుల‌కే మ‌రో అగ్ర నేత‌ను పోలీసులు ఎక్‌కౌంట‌ర్ చేశారు. చ‌త్తీస్‌గ‌ఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్ (Bijapur) నేష‌న‌ల్ పార్కు వ‌ద్ద జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర‌నేత‌, కేంద్ర క‌మిటీ స‌భ్యుడు సుధాక‌ర్ (Maoist Sudhakar) (65) మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా సుధాక‌ర్ స్వ‌స్థ‌లం ఏలూరు (Elur) జిల్లా చింత‌ల‌పూడి మండ‌లం ప్ర‌గ‌డ‌వ‌రం గ్రామం. 40 సంవ‌త్స‌రాలుగా మావోయిస్టు ఉద్య‌మంలో సుధాక‌ర్‌ ఉన్నారు. 2004లో నాటి ఏపీ ప్ర‌భుత్వంతో శాంతి చ‌ర్చ‌ల్లో ఆయ‌న‌ పాల్గొన్నారు. సింహాచ‌లం అలియాస్ సుధాక‌ర్‌పై రూ. 50 ల‌క్ష‌ల రివార్డు ఉంది. సుధాక‌ర్ పూర్తి పేరు తెంటు ల‌క్ష్మీన‌ర‌సింహాచ‌లం. గత నెల చివర్లో, బీజాపూర్ జిల్లాలో 24 మంది మావోయ...
Corona Virus | భారత్‌లో కరోనా మళ్లీ కలవరం 24 గంటల్లో 564 కొత్త కేసులు
National

Corona Virus | భారత్‌లో కరోనా మళ్లీ కలవరం 24 గంటల్లో 564 కొత్త కేసులు

Corona Virus | భారత్ లో మరోసారి కరోనా వైరస్‌ (COVID-19) ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 564 పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,866కి చేరింది. రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు: కేరళ – 1,487 కేసులు ఢిల్లీ – 562 కేసులు పశ్చిమ బెంగాల్ – 538 కేసులు మహారాష్ట్ర – 526 కేసులు గుజరాత్ – 508 కేసులు కర్ణాటక – 436 కేసులు తమిళనాడు – 213 కేసులు Corona Virus : పెరుగుతున్న మరణాలు.. గత 24 గంటల్లో 7 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇందులో ఢిల్లీలో ఒక చిన్నారి సహా ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు మరణించారు. దీంతో 2025లో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 51కి పెరిగింది. కాగా, ఇప్పటివరకు 3,955 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రజల...
error: Content is protected !!