Jammu and Kashmir | కశ్మీర్లో ముష్కరుల కుట్ర భగ్నం..
Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్లో దారుణమైన దాడికి పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదుల (Lashkar-e-Taiba (LeT) terrorists )తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల ఇళ్లను భద్రతా బలగాలు తనిఖీ చేయగా భారీ కుట్ర బహిర్గతమైంది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకోగా అధికారులు శుక్రవారం వెల్లడించారు.
తనిఖీ చేస్తుండగానే పేలుడు
పహల్గాం (Pahalgam) దాడి కేసులో ప్రధాన నిందితుడ9 ఆదిల్ హుస్సేన్ తొకార్ , మరో అనుమానిత ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లలో భద్రతా దళాలు సోదాలు చేశాయి. తనిఖీలు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఇద్దరూ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba )కు చెందినవారేనని తెలుస్తోంద. పేలుళ్లలో ఇద్దరి ఇళ్లూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. భద్రతా బలగాలు తనిఖీకి వచ్చినప్పుడు పేల్చేందుకు ముందుగానే బాంబులు అమర్చి ఉంచినట్లు అక్కడి దృశ్యాన్ని చూస్తుంటే స్పష్టమవుతోంది.
Jammu and Kashmir : ముమ్మరంగా సోదాలు
...




