Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్
జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ‘ఒసాకా ఎక్స్పో’ (Osaka Expo 2025) లో తెలంగాణ రాష్ట్రం తన పెవిలియన్ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారత పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
Osaka Expo 2025 : తొలి రాష్ట్రంగా తెలంగాణ
భారత్ పెవిలియన్లోకి ప్రవేశించి తెలంగాణ జోన్ను ఆవిష్కరించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ (Japan) లేదా ఎక్స్పోను సందర్శించడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ (Telangana), ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న తొలి భారతీయ రాష్ట్రం కూడా. ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఎక్స్పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకు...




