Sarkar Live

Privacy Policy

Karthi New Movie | కార్తీ 29 వ మూవీ అప్డేట్..
Cinema

Karthi New Movie | కార్తీ 29 వ మూవీ అప్డేట్..

Karthi New Movie : మొదటి నుండి హీరో కార్తీ (Karthi)తన మూవీస్ ని డిఫరెంట్ స్టైల్ లో తీస్తుంటాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తన మూవీస్ కి సే మ్ క్రేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వెరైటీ మూవీస్ తో ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటాడు. రొటీన్ రొడ్డ కొట్టుడు మూవీస్ కాకుండా ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతుంటాడు. ఖాకీ, ఖైదీ,సర్దార్, సత్యం సుందరం మూవీసే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.ఈ మూవీస్ ఫ్యాన్స్ ని ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ సర్దార్ (sardar) సీక్వెల్ కూడా మొదలుపెట్టిన కార్తీ…లోకేష్ కనకరాజు(Lokesh kanagaraj)తో ఖైదీ సీక్వెల్ ని కూడా మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajnikanth)తో కూలి మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకునే దశలో ఈ మూవీ ఉంది. ఇది అయ్యాక ఖైదీ-2 పనులు మొదలుపెట్టపోతున్నార...
Yuva Vikasam నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  వందశాతం రాయితీతో రూ. 50 వేల యూనిట్లు
Career

Yuva Vikasam నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వందశాతం రాయితీతో రూ. 50 వేల యూనిట్లు

TG Rajiv Yuva Vikasam తెలంగాణ రాష్ట్రంలో యువ వికాసం పథకం నిరుద్యోగులకు వరంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ప్రత్యేకంగా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం సహాయం చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు మండలాలు, సంక్షేమ వర్గాల జనాభా ఆధారంగా యూనిట్లు మంజూరు చేయనున్నారు. రూ.50 వేల విలువైన యూనిట్లకు 100 శాతం రాయితీ కల్పిస్తారు. ఈ పథకం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.‌శ్రీధర్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఓబీఎంఎంఎస్‌ ‌పోర్టల్‌ ‌ద్వారా అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం విధివిధానాలు ఇవీ.. య...
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో రసాభాస‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు
State

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో రసాభాస‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు

Telangana Assembly : తెలంగాణ శాసనసభలో ఈ రోజు జరిగిన సమావేశాలు తీవ్ర చర్చలకు వేదిక అయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చర్చ చివరి దశకు చేరుకోగా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం రగిలింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ (KT Rama Rao) చేసిన వ్యాఖ్యలు సభ (Telangana Assembly)లో దుమారం రేపాయి. కీల‌కాంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. సభలో ప్రధానంగా పలు అంశాలపై చర్చ జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం సాధారణ పరిపాలన, న్యాయ, హోం, ఆర్థిక, ఇంధన, రెవెన్యూ, గృహనిర్మాణం, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మంగళవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అదనపు వ్యయ అంచనాలను ప్రవేశపెట్టగా వీటి మొత్తాన్ని రూ.50,471 కోట్లుగా ప్రకటించారు. పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణలపై శాసనమండలిలో చర్చ జరగనుంది. అవయవదానం సంబంధిత తీర్మానాన్ని కూడా ప్రభుత్వం మండలిలో ప్...
Supreme Court stay | అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంత‌రం
Trending

Supreme Court stay | అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంత‌రం

Supreme Court stay : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఇటీవ‌ల ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. ఒక మ‌హిళ ఛాతీని తాక‌డం గానీ, ఆమె పైజామా తాడును లాగ‌డం గానీ చేస్తే అది నేరం కిందికి రాద‌ని అల‌హాబాద్ హైకోర్టు ఇటీవ‌ల వ్యాఖ్యానించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ తీర్పుపై స్టే విధిస్తున్న‌ట్టు ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం ఈ రోజు ప్ర‌క‌టించింది. అల‌హాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే.. ఒక మహిళను బలవంతంగా నగ్నంగా చేయడానికి ప్రయత్నించడం దాడిగా పరిగణించాలి గానీ దాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని ఓ కేసులో అల‌హాబాద్ హైకోర్టు మార్చి 17న తీర్పు చెప్పింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది మహిళా భద్రతకు విఘాతం క‌లిగించే తీర్పు అని, ఇది నిందితులను రక్షించేలా ఉంద‌ని న్యాయ నిపుణులు, మ‌హిళా సంఘాల ప్ర‌తినిధులు, సామాజికవేత్త‌లు అభ్యంత‌రం చె...
Gruha Jyothi scheme | ఉచిత విద్యుత్‌కు 156.56 కోట్లు.. నిధులు కేటాయించిన స‌ర్కారు
State

Gruha Jyothi scheme | ఉచిత విద్యుత్‌కు 156.56 కోట్లు.. నిధులు కేటాయించిన స‌ర్కారు

Gruha Jyothi scheme: గృహ జ్యోతి పథకం (Gruha Jyothi scheme) కింద వినియోగదారులకు ఉచిత విద్యుత్ (free electricity) అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.156.56 కోట్లు విడుద‌ల చేసింది. ఈ నిధుల‌తో అర్హులైన వారి గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. జీవో 10 ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద మొత్తం రూ.1,612.12 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇందులో భాగంగా మార్చి నెల ఖర్చుల కోసం రూ.156.56 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) సహా ఇతర విద్యుత్ పంపిణీ సంస్థలు అర్హులైన వినియోగదారులకు (domestic consumers) విద్యుత్ బిల్లులపై పూర్తిగా మాఫీ చేయనున్నాయి. Gruha Jyothi scheme : నిధుల కేటాయింపులు ఇలా.. TGSPDCL(Telangana State Southern Power Distribution Company Limited) సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ ప్రభుత్వం నుంచి ...
error: Content is protected !!