Vande Bharat Express | ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఈ మార్గంలో వందే భారత్ రైలు పొడిగింపు
Vande Bharat Express | ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో విజయవంతమయ్యాయి. చాలా చోట్ల 100 శాతం వరకు ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు వందే భారత్ రైళ్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా వందేభారత్ స్పీపర్ (Vande Bharat Express Sleeper ) రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది. సుదూర ప్రయాణాలు చేసే వారు ఈ స్లీపర్ వందేభారత్ రైళ్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల ఆశలకు అనుగుణంగా ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో చైర్కార్ వందే భారత్ రైళ్లను కూడా రైల్వేశాఖ కొన్ని మార్గాల్లో ప్రారంభించనుంది.
Vande Bharat Express : ప్రయాణికుల వినతి మేరకు
మరోవైపు ఎక్కువ ఆక్యూపెన్సీతో నడుస్తున్న రైళ్లను మరికొద్ది దూరం పాటు పొడిగించేందుకు భా...




