Sarkar Live

Privacy Policy

TS EAPCET 2025 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. గ‌డువు ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..
Career

TS EAPCET 2025 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. గ‌డువు ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..

విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET) ఒకటి. తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) ఈ పరీక్ష కోసం దరఖాస్తుల ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభిస్తోంది. విద్యార్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ eapcet.tsche.ac.in ద్వారా ఏప్రిల్ 4లోగా సమర్పించొచ్చు. రెండు విడ‌త‌లుగా TS EAPCET 2025 వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల పరీక్షలు : 2025 ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఉదయం 9:00 గంటల నుంచి 12:00 వరకు ఇంజనీరింగ్ కోర్సుల పరీక్షలు : 2025 మే 2, 5 తేదీల్లో మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జ‌రుగుతాయి. విద్యార్థులు నిర్ణీత తేదీలకు ముందే తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ప్రమాణాలు (Eligibility Criteria) TS EAPCET 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకునే...
Hit 3 Movie | మూవీ టీజర్ రిలీజ్.. నానీ ఈ మాస్ ఊహించలే..
Cinema

Hit 3 Movie | మూవీ టీజర్ రిలీజ్.. నానీ ఈ మాస్ ఊహించలే..

Hit 3 Movie : నేచురల్ స్టార్ నానీ (Natural Star Nani) కెరీర్ స్టార్టింగ్ లో పక్కింటి కుర్రాడి కేరక్టర్ లే చేశాడు. కానీ రాను రాను ఫుల్ మాస్ హీరోగా మారాడు. ఆయన నుండి వచ్చిన గత చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన దసరా మూవీ లో ఎంత మాస్ కేరక్టర్ చేశాడో మనం చూశాం. ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరో మూవీ పారడైజ్ (paradise) చేస్తున్నాడు.ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. దసరా (dasara) లాంటి బంపర్ హిట్టు తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనిలో కూడా పుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా నానీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన హిట్ -3 (HIt the third case) టీజర్ లో మాస్ కొద్దిగా ఎక్కువగానే చూపించినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ లెవల్ యాక్టింగ్… Hit 3 Movie పై ఆడియన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వస్తున్న ఈ మూవీ స్...
Elephant Attack | భక్తులపై ఏనుగుల దాడి .. ముగ్గురి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
State

Elephant Attack | భక్తులపై ఏనుగుల దాడి .. ముగ్గురి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

Three die in Elephant Attack : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్న‌మ‌య్య జిల్లా ( Annammaiah district) ఓబుల‌వారిప‌ల్లె మండ‌లం గుండ‌కోణ గ్రామంలో ఈ రోజు ఉద‌యం ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. శివాల‌యానికి వెళ్తున్న భ‌క్తుల (group of devotees)పై అడ‌వి ఏనుగులు దాడి చేశాయి. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అడ‌వి మార్గంలో ప్ర‌యాణిస్తుండ‌గా.. గ్రామస్థుల కథనం ప్రకారం… బాధితులు వై.కోట గ్రామానికి చెందినవారు. ప్రతి ఏటా మహాశివరాత్రి (Maha shivaratri) సంద‌ర్భంగా శివాలయం (shiva temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు గుండలకొణకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ప‌లువురు భక్తులు గుండలకొణ శివాలయానికి బయల్దేరారు. అడవి మార్గంలో వారు ప్రయాణిస్తుండగా అటుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు దాడికి దిగింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ...
Mutton Fish rates | మ‌ట‌న్‌, చేపల ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. ఎందుకంటే…
State

Mutton Fish rates | మ‌ట‌న్‌, చేపల ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. ఎందుకంటే…

Mutton Fish rates Hike in Telangana : హైద‌రాబాద్‌లో మాంసం, చేప‌ల ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. అదే స‌మ‌యంలో చికెన్ రేట్లు భారీగా ప‌డిపోతున్నాయి. బ్ల‌ర్డ్‌ఫ్లూ భ‌యం వ‌ల్లే ఈ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అత్య‌ధిక జ‌నం చికెన్‌ను వ‌దిలి మ‌ట‌న్, ఫిష్‌నే తింటున్నారు. దీంతో కోళ్ల ప‌రిశ్ర‌మ నిర్వాహ‌కులు, చికెన్ షాపుల య‌జ‌మానులు తీవ్ర న‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. Mutton Fish rates jump : చికెన్ వినియోగం ప‌డిపోవడం వ‌ల్లే హైదరాబాద్‌లో చికెన్ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో మటన్, చేపల ధరలు పెరుగుతాయి. చికెన్ ధరలు తగ్గుతుండగా, మటన్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. హైద‌రాబాద్ మార్కెట్‌లో ఒక‌ప్పుడు చికెన్ ధరలు స్థిరంగా ఉండేవి. ఇటీవల బర్డ్ ఫ్లూ భయాలు పెరగడంతో ప్రజలు చికెన్ కొనుగోలు చేయడం తగ్గించారు. దీంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. గత వారం రోజుల్లో మటన్ కొనుగోలు 40 శాతం పెరిగిందని షాప్ యజమానులు చెబుతున్నా...
TTD : తిరుమలలో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల జారీ.. ఆన్‌లైన్‌లో బుకింగ్
State

TTD : తిరుమలలో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల జారీ.. ఆన్‌లైన్‌లో బుకింగ్

TTD Special Entry Darshan : తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) భక్తులకు శుభ‌వార్త చెప్పింది. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) ఆన్‌లైన్ టికెట్లను విడుదల చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇవి ఈ రోజు (ఫిబ్రవరి 24) ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. భ‌క్తులు ముంద‌స్తుగా బుక్ చేసుకోవ‌డం వ‌ల్ల ఈ టికెట్లు జారీ అవుతున్నాయి. అంతేకాదు.. మార్చి నెలకు సంబంధించిన‌ పద్మావతి అమ్మవారి తిరుచానూరు ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా విడుదల చేస్తున్నట్లు దేవస్థానం వెల్లడించింది. భక్తులు వీటిని కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చ‌ని పేర్కొంది. TTD Special Entry Darshan : వసతి కేటాయింపు తిరుమల, తిరుపతిలో భక్తుల వసతి కోసం మే నెలకు సంబంధించిన వసతి కేటాయింపు ఈ రోజు (ఫిబ్రవరి 24న ) మ‌ధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. భక్తులు TTD అధికారిక వెబ్‌సైట్ (www.ttdse...
error: Content is protected !!