Sarkar Live

Privacy Policy

భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థి లోకం కదలాలి: తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు
Hyderabad

భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థి లోకం కదలాలి: తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు

హైదరాబాద్, మార్చి 23: దేశంలో దోపిడీ, పీడన లేని సమాజ స్థాపన కోసం విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో మరో పోరాటానికి విద్యార్థి, యువజనులు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ (AISF) మాజీ జాతీయ అధ్యక్షులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. సోమవారం నాడు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రామ్ కోఠిలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విప్లవ ధ్రువతారలు భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. బ్రిటిష్ వలస పాలన నుండి దేశాన్ని విముక్తి చేసేందుకు అనేకమంది ప్రాణత్యాగం చేశారని, అందులో చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ యువతకు నిత్య స్ఫూర్తి అని కొనియాడారు. 1907 సెప్టెంబర్ 28న జన్మించిన భగత్ సింగ్, జాతీయ భావాలు గల కుటుంబం నుండి వచ్చి దేశం కోసం బలిదానమయ్యారన...
ఉద్యమకారునికి అండగా పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి: రూ. 50 వేల ఆర్థిక సాయం
warangal

ఉద్యమకారునికి అండగా పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి: రూ. 50 వేల ఆర్థిక సాయం

గీసుకొండ, వరంగల్ జిల్లా: కష్టాల్లో ఉన్న ఉద్యమకారులను ఆదుకోవడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి చాటిచెప్పారు. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ఉద్యమకారుడు కోట ప్రవీణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అతని వైద్య ఖర్చుల నిమిత్తం బాలకిశోర్ రెడ్డి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా, వారి ప్రతినిధిగా గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజకుమార్ స్వయంగా వెళ్లి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా రాజకుమార్  మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఏ కష్టం వచ్చినా బాలకిశోర్ రెడ్డి తోపాటు  తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం చేసినందుకు గీసుకొండ మండల ఉద్యమకారులు అల్లం బాలకిశోర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెల...
Paddy Scam | మిల్లుల్లో ‘నిల్’.. రికార్డుల్లో ‘ఫుల్’..
Special Stories

Paddy Scam | మిల్లుల్లో ‘నిల్’.. రికార్డుల్లో ‘ఫుల్’..

హరిహర, శ్రీలక్ష్మీ సాయి మిల్లుల్లో ధాన్యం మాయం! Warangal Rice Mill Paddy Scam | ప్రభుత్వ రికార్డుల్లో చూస్తే వేల క్వింటాళ్ల ధాన్యంతో ఆ మిల్లులు కళకళలాడుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అడుగుపెడితే అక్కడ ఖాళీ గదులు దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, మిల్లు యజమానుల కాసుల కక్కుర్తి వెరసి ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోంది. వరంగల్ జిల్లాలోని హరిహర ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ సాయి బిన్నీ రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నిబంధనలు బేఖాతరు.. ఇష్టారాజ్యం! కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు మిల్లుల యజమానులు నిబంధనలను తుంగలో తొక్కారు. కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తీవ్ర ఆ...
కాంగ్రెస్‌కు భారీ షాక్: పార్టీకి జీవన్‌ రెడ్డి గుడ్‌ బై.. రాజీనామా లేఖలో సంచలన నిజాలు! – Jeevan Reddy Resigns Congress
State

కాంగ్రెస్‌కు భారీ షాక్: పార్టీకి జీవన్‌ రెడ్డి గుడ్‌ బై.. రాజీనామా లేఖలో సంచలన నిజాలు! – Jeevan Reddy Resigns Congress

Jeevan Reddy Resigns Congress | ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్ధండుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలికారు. ఈ నెల మార్చి 25న తాను అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ, పార్టీని వీడటానికి గల కారణాలను వివరిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 20 నెలల మానసిక క్షోభ: లేఖలో ఆవేదన తన రాజకీయ సహచరులు, అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖలో జీవన్ రెడ్డి కీలక విషయాలను ప్రస్తావించారు. "గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానాలను ఎదుర్కొంటున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకుని, గౌరవం లేని చోట ఇంకా కొనసాగడం నా వల్ల కాదు. ఈ మానసిక క్షోభను అనుభవిస్తూ పార్టీలో ఉండలేను" అని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ నేత జీవన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రా...
భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి మేము అడ్డు కాదు – కానీ స్థానికులకు అన్యాయం చేస్తే సహించం 
warangal

భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి మేము అడ్డు కాదు – కానీ స్థానికులకు అన్యాయం చేస్తే సహించం 

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై చెరబండరాజు నగర్ కాలనీ వాసుల ధ్వజం హన్మకొండ: భద్రకాళి దేవస్థాన మాడ వీధుల అభివృద్ధి పేరుతో గత 23 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న బండ కార్మికుల కుటుంబాలను ఖాళీ చేయించి, బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చాలని చూడటం దుర్మార్గమని చెరబండరాజు నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానికేతరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యేకు కాలనీ వాసుల సూటి ప్రశ్నలు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టా పొంది, అక్కడ నివసించే వారికే ఆ హక్కు వర్తిస్తుంది. కానీ, ఇక్కడ నివాసం లేని వారికి ఏ ప్రాతిపదికన లబ్ధి చేకూరుస్తున్నారు? కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, ...
error: Content is protected !!