Rice Mill Scam | వెంకటేశ్వరా…ధాన్యం ఎక్కడా?
గాంధీనగర్ (మాణిక్యాపూర్ )లో రూ 2 కోట్ల ధాన్యం గల్లంతైనట్లు ఆరోపణలు
ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే డి సి ఎస్ ఓ సైతం విస్తుపోవాల్సిందే
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్(మాణిక్యాపూర్)లో మిల్లర్ ఇష్టారాజ్యం
Rice Mill Scam in Bheemadevarapalli | హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ (మాణిక్యాపూర్) గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో 2025-26 ఖరీఫ్ సీజన్ భారీస్థాయిలో ధాన్యం గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం మిల్లు నుండి మాయమైనట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
ప్రభుత్వం నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, సదరు మిల్లర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులు అ...




