Sarkar Live

Privacy Policy

‘గోల్డ్ మ్యాన్’ కాదు.. అంతా ‘రోల్డ్ గోల్డ్’: పాతబస్తీ సూర్యాభాయ్ బండారం బట్టబయలు!
Hyderabad

‘గోల్డ్ మ్యాన్’ కాదు.. అంతా ‘రోల్డ్ గోల్డ్’: పాతబస్తీ సూర్యాభాయ్ బండారం బట్టబయలు!

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన 'గోల్డ్ మ్యాన్ (Gold Man) ' సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ అసలు రంగు బయటపడింది. ఒళ్లంతా కిలోల కొద్దీ బంగారంతో మెరిసిపోయే ఆయన.. నిజానికి ధరించింది కేవలం నకిలీ ఆభరణాలేనని ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులు తేల్చారు. కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా సూర్యాభాయ్ భాగోతం వెలుగులోకి వచ్చింది. ​ఐటీ విచారణలో తేలిన షాకింగ్ నిజాలు ​ సూర్యాభాయ్ ధరించే ఆభరణాలన్నీ రాగితో తయారు చేసి, వాటిపై పూత పూసినవని అధికారులు గుర్తించారు. 32 రకాల నకిలీ ఆభరణాలను ఆయన వాడుతున్నట్లు తేలింది.  బయటికి కోట్లాది రూపాయల విలువైన బంగారంగా కనిపించే ఆ నగలు, వాస్తవానికి కేవలం రూ. 3 లక్షల విలువ మాత్రమే చేస్తాయని అధికారులు నిర్ధారించారు. కేవలం ఒక్క ఆభరణం మాత్రమే వెండిపై బంగారు పూతతో తయారైనట్లు గుర్తించారు.బయటికి ధనవంతుడిగా ఫోజులిచ్చే సూర్యాభాయ్‌ కి సొంత ఇల...
హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam
Special Stories

హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam

Hanamkonda Rice Mill Scam Paddy Missing News : హన్మకొండ జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాయమైతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు మిల్లర్లు ఆడుతున్న ‘మాయాజాలం’ బయటపదుతోంది. దామెర మండలం ల్యాదల్లలోని లక్ష్మిగణపతి, పంథినిలోని వైష్ణవి రైస్ మిల్లుల్లో సుమారు రూ. 3.5 కోట్లకు పైగా విలువైన ధాన్యం పక్కదారి పట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. ​"లక్ష్మిగణపతి" లో ఖాళీ సంచులే దర్శనం! దామెర మండలం ల్యాదల్ల​ గ్రామంలో ని లక్ష్మిగణపతి రైస్ మిల్లులో రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదు. సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు సమాచారం. అక్కడ ధాన్యపు రాశులకు బదులు కేవలం ఖాళీ సంచులే దర్శనమివ్వడం మిల్లర్ నిర్వాకానికి అద్దం పడుతోంది. "​వైష్ణవి "మిల్లులోనూ అదే బాట.. ​ఇక పంథిని గ్రామంలోని వైష్ణవి మిల్లు పరిస్థిత...
ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుంజ రాము: 22వ వర్ధంతి సభలో నేతల నివాళి
warangal

ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుంజ రాము: 22వ వర్ధంతి సభలో నేతల నివాళి

ఆదివాసీల స్వయం పాలన, హక్కుల పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప నాయకుడు, ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ వ్యవస్థాపకుడు కుంజ రాము అని పలువురు ఆదివాసీ సంఘాల నేతలు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మోకాళ్లపల్లె గ్రామంలో శనివారం కుంజ రాము 22వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఆయన పుత్రుడు కుంజ సూర్యం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు మరియు ఆదివాసీ తోటి తెగ నేతలు పాల్గొని రాము చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాము ఆశయాలే సీతక్కకు మార్గదర్శకం: కొడప రఘు ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ తోటి PVTG సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొడప రఘు మాట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతి కోసం పరితపించిన కుంజ రాము ఆశయాలను ఆయన సతీమణి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కొనసాగిస్తున్నారని తెలిపారు. ఒక సాధారణ ఆదివాసీ మహిళగా ఉద్యమ బాట నుండ...
ఇది ‘కారం’ ఘాటు కాదు.. పచ్చి విషం!  వరంగల్​ మార్కెట్‌లో కల్తీ మిర్చి మాఫియా – Adulterated Chili Powder
Special Stories

ఇది ‘కారం’ ఘాటు కాదు.. పచ్చి విషం! వరంగల్​ మార్కెట్‌లో కల్తీ మిర్చి మాఫియా – Adulterated Chili Powder

సామాన్యుడి ప్రాణాలతో చెలగాటం! Adulterated Chili Powder | ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచిన ఎనుమాముల మార్కెట్ (Enumamula market) ఇప్పుడు కల్తీ మాఫియాకు అడ్డాగా మారి సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తోంది. వంటలకు రుచిని ఇచ్చే కారం పొడి.. ఇప్పుడు ప్రాణాలను హరించే విషంగా మారుతోంది. పదుల సంఖ్యలో వెలిసిన కారం మిల్లులు యథేచ్ఛగా కల్తీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. తొడిమలే ‘ముడి’ సరుకు.. తాలుకాయలే ‘బలం’! సాధారణంగా నాణ్యమైన మిర్చిని వేరు చేసిన తర్వాత వచ్చే తాలు (పనికిరాని మిర్చి), మిర్చి తొడిమెలు, బూజు పట్టిన గింజలను ఈ కల్తీ రాయుళ్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. వీటిని పొడి చేసి, దానికి ఆకర్షణీయమైన ఎరుపు రంగు రావడానికి ప్రమాదకరమైన సింథటిక్ రంగులు (Synthetic Colors),చూడటానికి ఎర్రగా, నిగనిగలాడుతూ కనిపించే ఈ కారం పొడి (Adulterated Chili ...
సీతక్కపై విమర్శలు చేస్తే సహించేది లేదు: మాజీ రెడ్కో చైర్మన్‌పై రేగ కళ్యాణి నిప్పులు
warangal

సీతక్కపై విమర్శలు చేస్తే సహించేది లేదు: మాజీ రెడ్కో చైర్మన్‌పై రేగ కళ్యాణి నిప్పులు

ములుగు: తెలంగాణ రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ ఏరువా అలియాస్ గుంటూరు సతీష్ రెడ్డి తీరుపై ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సతీష్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం మంత్రి సీతక్కపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 100 కోట్ల ఖర్చుకు 200 కోట్ల స్కాం ఎలా సాధ్యం? మేడారం ఆలయ ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి సతీష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రేగ కళ్యాణి తిప్పికొట్టారు. "మేడారం గుడి ప్రాంగణ నిర్మాణానికే వంద కోట్లు ఖర్చు అయితే.. అందులో 200 కోట్ల స్కాం జరిగిందని చెప్పడం నీ అవివేకానికి నిదర్శనం. అద్దాల మేడల్లో ఉంటూ ప్రకటనలు ఇచ్చే నీకు క్షేత్రస్థాయి పరిస్థితులు ఏం తెలుసు?" అని ప్రశ్నించారు. మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఘనత సీతక్కకే దక్కుతుందని ఆమె స్పష...
error: Content is protected !!