Sarkar Live

Privacy Policy

Lionel Messi  | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్
Hyderabad, Sports

Lionel Messi | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) 'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆద్యంతం ఆనంద క్షణాలతో సాగింది. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మెస్సీ, భారీ బందోబస్తు మధ్య నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు .ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెస్సీకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన 'మీట్-అండ్-గ్రీట్' కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఉప్పల్‌లో రేవంత్ సింగరేణి టీమ్‌ విజయంమీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధ...
Food Poisoning | క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌రుస‌ ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..
State, Hyderabad

Food Poisoning | క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌రుస‌ ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..

Food Poisoning | హైదరాబాద్: మహానగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో కలుషితాహారం (Food Poisoning) కారణంగా 66 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, మాదాపూర్‌లోని చంద్రానాయక్‌ తండా ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనారిటీ గురుకుల పాఠశాలలో 22 మందికి అస్వస్థతకు గుర‌య్యారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. 22 మంది విద్యార్థినులు (పాఠశాలలో మొత్తం 337 మంది చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనంలో పాడైపోయిన పెరుగు ఇవ్వడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థినులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో కింగ్‌కోఠి మర...
Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి
Crime, AndhraPradesh

Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి

Alluri Sitarama Raju Road Accident | అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజుగారిమెట్టు వద్ద ప్రమాదం ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్టు మలుపు వద్దకు రాగానే, బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. బస్సు కూడా చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలం వద్ద ...
ఇంటిని చూసుకోమంటే ‘ఊడ్చేశారు’.. హైద‌రాబాద్‌లో Nepali Gang హ‌ల్‌చ‌ల్
Crime

ఇంటిని చూసుకోమంటే ‘ఊడ్చేశారు’.. హైద‌రాబాద్‌లో Nepali Gang హ‌ల్‌చ‌ల్

Hyderabad Nepali Gang Theft | హైద‌రాబాద్ న‌గ‌రంలోని మ‌ల‌క్‌పేట‌లో ఓ నేపాలి గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్ చేసింది. వ్యాపారి (Businessman) ఇంట్లోంచి పెద్ద‌ మొత్తంలో బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గదు, విలువైన వ‌స్తువులు అప‌హ‌రించి ఉడాయించింది. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి ప‌నులు చూసుకోవ‌డంతోపాటు సెక్యూరిటీగా ఉన్న దంప‌తులే (Couple of Nepalis) మ‌రికొంద‌రితో క‌లిసి ఆ చోరీకి పాల్ప‌డ్డారు. ఇంటి మ‌నుషుల్లా చూసుకున్నా.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మ‌ల‌క్‌పేటలో నివ‌సించే వ్య‌పారి ఇంటి ప‌నుల (Domestic work) నిమిత్తం కొంత‌కాలం క్రితం నేపాలి దంప‌తుల‌ (Couple of Nepalis)ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. సెక్యూరిటీగా ఉంటూ ఇంటి ప‌నులు చూసుకొనే ఈ భార్యాభ‌ర్త‌లు కొన్ని రోజుల్లోనే య‌జ‌మానిని ప్ర‌స‌న్నం చేసుకున్నారు. ఎంతో న‌మ్మ‌కంగా ఉంటూ వ‌చ్చిన ఆ నేపాలి దంపతులను య‌జ‌మాని కుటుంబం త‌న ఇంటి మ‌నుషుల్లా చూసుకొన...
తొలి విడ‌త పోలింగ్ పూర్తి.. ఉత్సాహంగా ఓటు వేసిన గ్రామ‌స్థులు – Gram panchayat elections
State

తొలి విడ‌త పోలింగ్ పూర్తి.. ఉత్సాహంగా ఓటు వేసిన గ్రామ‌స్థులు – Gram panchayat elections

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram panchayat elections) తొలి దశ పోలింగ్ పూర్త‌య్యింది. తీవ్ర చ‌లి (Cold)ని కూడా లెక్క చేయ‌కుండా ఓట‌ర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ (Sarpanch), వార్డు సభ్యుల పదవుల (Ward member posts) కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటు వేయడానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు (Senior citizens) ఉదయం నుంచే క్యూక‌ట్టారు. 56,19,430 మంది ఓటర్లు.. 37,562 పోలింగ్ కేంద్రాలు మొద‌టి విడ‌త పంచాయ‌తీ (Gram panchayat elections) ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు అభ్య‌ర్థులు పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56,19,430 మంది ఓటర్లు ఉండ‌గా 37,562 పోలింగ్ కేంద్రాలు (Polling stations) ఏర్పాటు అయ్యాయి. పోలింగ్ మధ్యాహ్నం ఒ...
error: Content is protected !!