Sarkar Live

Privacy Policy

తెలంగాణ ఉద్యమకారుల ‘గోస’..కాంగ్రెస్ సర్కార్‌పైనే ఆశలు.. ‌‌– Telangana Agitators Welfare
Special Stories

తెలంగాణ ఉద్యమకారుల ‘గోస’..కాంగ్రెస్ సర్కార్‌పైనే ఆశలు.. ‌‌– Telangana Agitators Welfare

మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనే భారం! Telangana Agitators Welfare : స్వరాష్ట్ర కల సాకారమై దశాబ్దం దాటినా, ఆ కల కోసం లాఠీ దెబ్బలు తిని, జైలు గోడల మధ్య నలిగిపోయిన సామాన్య ఉద్యమకారుల బతుకులు నేటికీ 'గోస' పడుతూనే ఉన్నాయి. పదవుల పంపకాలు పూర్తి కావడంతో పాలన గాడిలో పడింది కానీ, క్షేత్రస్థాయిలో పోరాడిన యోధుల సంక్షేమం మాత్రం ఇంకా హామీలకే పరిమితమైంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మొండిచేయి ఎదురవ్వగా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఉద్యమకారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో అన్యాయం.. ఆవేదనలో ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమమే పునాదిగా అధికారంలోకి వచ్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమకారులను విస్మరించిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. జైలుకు వెళ్లిన వారికి, అక్రమ కేసులు ఎదుర్కొన్న సామాన్యులకు తగిన గుర్తింపు లభించలేదు. కొద్దిమందికే పదవులు దక్కాయని, మెజారిటీ పోరాట య...
పైలట్ రోహిత్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్.. 
Hyderabad

పైలట్ రోహిత్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్.. 

బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు! మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారశైలిపై భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినేత కె. చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేస్తూ, పార్టీ అధిష్టానం రోహిత్ రెడ్డి కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మాదక ద్రవ్యాల (Drugs) వినియోగానికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు, ఆరోపణలను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. క్రమశిక్షణారాహిత్యం మరియు పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించినందుకు గాను రోహిత్ రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.మీడియాలో వస్తున్న ఆరోపణలపై వారం రోజుల్లోగా స్పష్టమైన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.నిర్ణీత గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే, పార్టీ నియమావళి ప్రకారం సభ్యత్వంపై వేటు (బహిష్కరణ) తప్పదని అధిష్టానం హెచ్చరించింది. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడ...
Hyderabad | చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి.. ఒకే కాలనీలో విషాద ఛాయలు!
Crime

Hyderabad | చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి.. ఒకే కాలనీలో విషాద ఛాయలు!

Hyderabad News | సరదాగా చేపల వేటకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల ప్రాణాలను మూసీ నది (Musi River) బలితీసుకుంది. గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ విషాదకర ఘటన వెలుగుచూసింది. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇబ్రహీంబాగ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే? హైదరాబాద్ (Hyderabad) ఇబ్రహీంబాగ్‌కు చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25) ముగ్గురూ ప్రాణ స్నేహితులు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా చేపలు పట్టేందుకు గండిపేట పరివాహక ప్రాంతంలోని మూసీ నది వద్దకు వెళ్లారు. అయితే, నదిలో నీటి ఉధృతి, లోతు ఎక్కువగా ఉండటంతో వారు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు. యువకులు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీం ఆదివారం సాయంత్రం నుంచే గాలింపు చర్యలు చేపట్టింది....
Rice Mill Scam | ‘అరవింద’ రైస్ మిల్లులో భారీ గోల్‌మాల్!
Special Stories

Rice Mill Scam | ‘అరవింద’ రైస్ మిల్లులో భారీ గోల్‌మాల్!

వేల క్వింటాళ్ల సర్కారు ధాన్యం మాయం! ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే అధికారులు విస్తుపోవాల్సిందే Narsampet Rice Mill Scam | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ప్రముఖ రైస్ మిల్లు 'అరవింద' ఇప్పుడు తీవ్ర ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుంది. ప్రభుత్వం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం సేకరించిన వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు మిల్లులో కనిపించకపోవడం (Rice mill Paddy Missing) స్థానికంగా కలకలం రేపుతోంది. రికార్డులకు, మిల్లులోని అసలు నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో 'ధాన్యం ఆవిరైందా? లేక అమ్మేశారా?' అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. Rice Mill Scam : అసలేం జరిగింది? ప్రభుత్వం ప్రతి ఏటా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి పౌరసరఫరాల శాఖకు (CMR రూపంలో) అప్పగించే బాధ్యతను రైస్ మిల్లులకు అప్పగిస్తుంది.2025-26 ఖరీఫ్ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2567 మెట్రిక్ టన్నుల ధాన్యాన్...
Food Safety | తెలంగాణలో హోటళ్లపై FSSAI పంజా: వేల సంఖ్యలో తనిఖీలు.. వందల మందికి భారీ జరిమానాలు!
State

Food Safety | తెలంగాణలో హోటళ్లపై FSSAI పంజా: వేల సంఖ్యలో తనిఖీలు.. వందల మందికి భారీ జరిమానాలు!

హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార నాణ్యత (Food Safety) విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) స్పష్టం చేస్తోంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వేల సంఖ్యలో ఆహార నమూనాలను సేకరించి విశ్లేషించిన అధికారులు, నిబంధనలు ఉల్లంఘించిన వందలాది హోటళ్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. మూడేళ్ల రిపోర్ట్: గణాంకాలు ఏం చెబుతున్నాయి? తెలంగాణలో ఆహార భద్రతా తనిఖీలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర తినుబండారాల తయారీ కేంద్రాలపై అధికారులు నిశితంగా దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంవిశ్లేషించిన నమూనాలుజరిమానా పడిన హోటళ్లురద్దు చేసిన లైసెన్సులు2024-253,347125012023-246,156425062022-234,80931509 వాడిన నూనెపై ‘రుకో’ (RUCO) నిఘా! వంట నూనెను పదేపదే మరిగించడం వల్ల అది ఆరోగ...
error: Content is protected !!