Sarkar Live

Privacy Policy

Government Jobs | రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు
State, Hyderabad

Government Jobs | రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు

Hyderabad | పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌-2 నియామకాలలో ఎంపికై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో 14 మంది కొత్త‌గా సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమితుల‌య్యారు. వీరంతా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని (Ponguleti Srinivas Reddy) సచివాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని మంత్రి అభినందించి ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌ బుక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ . స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయతీ, నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ పేరు ప్రతిష్టలను ఇనుమడిరపజేయాలని ఉద్బోధించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు (Government Jobs) లభిస్తున్నాయని అన్నారు. ఆనాటి ప్రభుత్వం చేపట్టిన అరక...
Nizamabad | కానిస్టేబుల్‌ హత్య నిందితుడు రియాజ్ ఎన్‌కౌంట‌ర్‌
Crime

Nizamabad | కానిస్టేబుల్‌ హత్య నిందితుడు రియాజ్ ఎన్‌కౌంట‌ర్‌

Nizamabad | తెలంగాణలో సంచలనం సృష్టించిన‌కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ (Sheikh Riaz) మృతి చెందాడు. ఈ విష‌యాన్ని వైద్యులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) పై క‌త్తితో దారుణంగా దాడిచేసి చేసిన రియాజ్.. అక్కడి నుంచి పారిపోయాడు.ఈ దాడిలో కానిస్టేబుల్ అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన ఈ ఘటనపై పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్ప‌డి ముమ్మ‌రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీ షీటర్ రియాజ్ (Riyaz) ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోతుండ‌గా రియాజ్‌‌ను పట్టుకునేందుకు ఓ యువ‌కుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి రియాజ్ దాడ...
Hyderabad | కవిత కుమారుడు పొలిటిక‌ల్ ఎంట్రీ తల్లితో కలిసి బీసీ బంద్‌ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య!
Viral

Hyderabad | కవిత కుమారుడు పొలిటిక‌ల్ ఎంట్రీ తల్లితో కలిసి బీసీ బంద్‌ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య!

BC Bandh Hyderabad | తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ కుటుంబం నుంచి మరో తరం పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తోంద‌నే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తాజాగా బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతూ రంగంలోకి దిగారు. ఖైరతాబాద్‌ చౌరస్తాలో తెలంగాణ‌ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత ధర్నా చేశారు. అయితే, ఈ ధర్నాలో ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తల్లితోపాటు రోడ్డుపై బైఠాయించి బీసీ రిజర్వేషన్ల కోసం నినాదాలు చేశారు. ఆదిత్య తన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగు వేసినట్లు ప‌లువురు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఆ పిలుపున‌కు మద్దతుగా కవిత సైతం ఉద్యమంలో పాల్గొని, బీసీ హక్కుల కోసం తన సమరభే...
Rain Forecast | తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
State, warangal

Rain Forecast | తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Forecast | వ‌రంగ‌ల్ : తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప‌లు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుర‌నున్నాయ‌ని పేర్కొంటూఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఆదివారం భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, మానుకోట‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, పాల‌మూరు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ...
Mamnoor Airport | మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీల‌క ప‌రిణామం..
State, warangal

Mamnoor Airport | మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీల‌క ప‌రిణామం..

Warangal Mamnoor Airport | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమానంగా, ఆధునిక సదుపాయాలతో వరంగల్ సమీపంలోని మామునూర్ వద్ద కొత్త‌ విమానాశ్రయ నిర్మాణం (Mamnoor Airport) జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం తాజాగా రూ.90 కోట్ల నిధుల‌ను అదనంగా మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లుచ‌ భవనాల (విమానాశ్రయాలు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు న‌ష్ట‌పరిహారం గతంలోనే ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి కొత్తగా విడుదలైన నిధులతో కలిపి భూసేకరణ కోసం మొత్తం 295 కోట్లను కేటాయింట్లు అయింది. భూములను కోల్పోతున్న రైతులు, యజమానులకు నష్టపరిహారం చెల్లించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ఈ నిధులు బదిలీ చేయనున్నట్టు తెలుస్...
error: Content is protected !!