Sarkar Live

Privacy Policy

HAM roads | హ్యామ్‌ రోడ్లకు నేడు టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల!
State

HAM roads | హ్యామ్‌ రోడ్లకు నేడు టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల!

Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తూ గ్రామీణ రహదారుల అభివృద్ధికి సిద్ద‌మైంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీత‌క్క ప్ర‌కారం.. హ్యామ్‌ ప్రాజెక్టుల (HAM roads) కోసం టెండర్‌ నోటిఫికేషన్ శుక్ర‌వారం విడుదల చేయ‌నున్నారు. మొదటి దశలో 7,449.50 కిలోమీటర్ల పొడవుతో 2,162 రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి సీత‌క్క‌ వెల్లడించారు. ఇవి మొత్తం 96 నియోజకవర్గాల పరిధిలో 17 ప్యాకేజీల కింద చేపట్టనున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ – “హ్యామ్‌ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ రహదారి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనాలని కోరుతున్నాం” అని తెలిప...
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు — 44 ఏళ్ల అజ్ఞాత జీవనానికి ముగింపు – Mallojula Venugopal Rao
Crime

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు — 44 ఏళ్ల అజ్ఞాత జీవనానికి ముగింపు – Mallojula Venugopal Rao

Mallojula Venugopal Rao : మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అడ‌వి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. బుధవారం తన 60 మంది మావోయిస్టు సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. సీఎం స‌మ‌క్షంలో వీరు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. దాదాపు మావోయిస్టు పార్టీ రెండో అగ్రస్థానంలో ఉన్న మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ న‌ష్టంగా భావిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ వైఖరితో అసంతృప్తి వ్య‌క్తంచేస్తూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని విప్ల‌వోద్య‌మాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మల్లోజులపై దాదాపు వందకు పైగా కేసులు కూడా ఉన్నాయి. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డ...
హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ ఆత్మహత్య
Crime

హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ ఆత్మహత్య

Haryana IPS officer suicide case | హర్యానా పోలీసు అధికారి వై. పురాణ్ కుమార్ మృతి కేసులో ఊహించ‌ని మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు అధికారి రోహ్‌తక్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడిని సందీప్ కుమార్‌గా గుర్తించారు. ఆయన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆయన సైబర్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.లాధోట్ గ్రామంలోని అతని ఇంటి నుంచి మూడు పేజీల సూసైడ్ నోట్ తోపాటు ఒక వీడియోను స్వాధీనం చేసుకున్నారు. కుమార్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని విశ్వ‌స‌నీయ వర్గాలు తెలిపాయి. ఆ నోట్‌లో, వై. పురాణ్ కుమార్ ఒక "అవినీతి అధికారి" అని, అతనిపై "తగినంత ఆధారాలు" ఉన్నాయని ఆరోపించారు. కుల వివక్ష సమస్యను ఉపయోగించి ఐపీఎస్ అధికారి వ్యవస్థను హైజాక్ చేశారని కూడా ఆయన ఆరోపించారు. "నేను ఎప్పుడూ సత్యం పక్షాన ఉంటాను. స్వాతంత్ర్య పోరాటంలో నా కుటుంబం పాల్గొంది. భగత్ సింగ్‌ను నా ఆదర్శంగా భావ...
Suicide | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
Crime, State

Suicide | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌ ‌బాలానగర్‌ ‌(Balanagar) ప్రాంతంలో విషాదక‌ర‌ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మృతురాలిని చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు. ఆమె భర్త అనిల్‌ ‌కుమార్‌ ‌తో కలిసి పద్మారావు నగర్‌ ‌ఫేజ్‌-1, ‌బాలానగర్‌ ‌లో నివాసముంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్‌ ‌కార్తికేయ, లాస్యతవల్లి ఉన్నారు. అయితే స్థానికుల క‌థ‌నం మేర‌కు కొంతకాలంగా భర్తతో విభేదాలు, వ్యక్తిగత సమస్యల కార‌ణంగా తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ, క్ష‌ణికావేశంతో తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మ‌రో ఘ‌ట‌న‌లోకొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండలంలోని గంభీరావుపేట గ్రామానికి చెందిన సైదం కల్పన(...
హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం – తెలంగాణకు కేంద్రం భారీ కేటాయింపులు – Telangana Highways
State, Hyderabad

హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం – తెలంగాణకు కేంద్రం భారీ కేటాయింపులు – Telangana Highways

Telangana Highways | రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను హ్యామ్ (HAM )విధానంలో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమితిచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,661 కోట్ల నిధులను జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 431 కిలోమీటర్ల మేర రహదారులను హ్యామ్ పద్దతిలో నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించారు. ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు 40:60 నిష్పత్తిలో నిధులు ఖ‌ర్చును పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవ‌త్స‌రం జాతీయ స్థాయిలో 124 జాతీయ రహదారులను నిర్మించాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. రూ.3,45,466 కోట్లతో 6,376 కిలోమీటర్ల మేర ర‌హ‌దారులు నిర్మించ‌నున్నారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసి చేపట్టే ఈ రహదారుల నిర్మాణాల తాత్కాలిక జాబితాలో రాష్ట్రానికి చెందిన ఐదు జాతీయ రహదారులకు చోటు దక్కడం విశేషం. Telangana Highways : రాష్ట్రానికి లభించిన ప్రధాన ప్రాజెక్టుల...
error: Content is protected !!