chhattisgarh : మావోయిస్టులకు భారీ షాక్
23 మంది మహిళా మావోయిస్టులు సహా 103 మంది మావోయిస్టుల లొంగుబాటు
Chhattisgarh Naxal News : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు (Maoists ) ఉద్యమంపై భద్రతా దళాలు మరో కీలక విజయం సాధించాయి. శుక్రవారం 103 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో 23 మంది మహిళలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్ అభయారణ్యం మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. కానీ ఇటీవల భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టిన యాక్షన్ ప్లాన్, అవగాహన కార్యక్రమాలు, పునరావాస పథకాలు మావోయిస్టుల ఆలోచనల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో నక్సలైట్లు లొంగిపోతున్నారు.
లొంగిపోయిన 103 మంది మావోయిస్టుల్లో 49 మందిపై రూ.1.06 కోట్లకు పైగా రివార్డు ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పెద్ద విజయంగా చెప్పవచ్చు.లొంగుబాటుతోపాటు పునరావాసం, ప్రధాన స్రవంత...




