Sarkar Live

Privacy Policy

రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ముంచెత్త‌నున్న వ‌ర్షాలు – Hyderabad floods 2025
Hyderabad

రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ముంచెత్త‌నున్న వ‌ర్షాలు – Hyderabad floods 2025

Hyderabad floods 2025 : కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు,వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతున్న‌ తెలంగాణ‌కు ఐఎండీ మ‌రోమారు వాతావ‌ర‌ణ‌ హెచ్చ‌రిక‌ జారీ చేసింది. రాష్ట్రంలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్‌ ఒకటి నాటికి ఉత్తర, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ప...
Telangana | ఇక సర్కారు చేతుల్లోకి సెల్‌ఫోన్ సీక్రెట్స్‌
Technology

Telangana | ఇక సర్కారు చేతుల్లోకి సెల్‌ఫోన్ సీక్రెట్స్‌

Israeli Hacking software : తెలంగాణ ప్రభుత్వం (Telangana Governament) తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం పెద్ద చర్చకు దారి తీసింది. సైబర్ నేరాల దర్యాప్తుల‌ను వేగ‌వంతం చేయల‌నే ఉద్దేశంతో ఇజ్రాయెలీ కంపెనీ వ‌ద్ద ఓ సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు స‌ర్కారు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సాఫ్ట్‌వేర్ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాల్లోకి చొర‌బ‌డి హ్యాక్ చేయగలదు. త‌ద్వారా నేరాల‌కు సంబంధించి పోలీసులు (police department) ఆధారాల‌ను త్వ‌రిత‌గ‌తిన తెలుసుకునేందుకు సుల‌భ‌త‌రం అవుతుంది. అయితే.. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముఖ్యంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇది క‌ల‌క‌లం రేపుతోంది. ఇది నేరాలు జ‌రిగిన‌ప్పుడే మాత్ర‌మే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నాదీనిని దుర్వినియోగం చేసే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని విప‌క్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ డేటా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వ‌స్...
IAS transfers | సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం
State

IAS transfers | సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం

IAS transfers : తెలంగాణ (Telangana) ప్రభుత్వంలో ముఖ్యమైన పరిపాలనా విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు ప్ర‌భుత్వం (State Government) స్థానచ‌ల‌నం క‌ల్పించింది. ముఖ్యంగా సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా హైకోర్టు (High Court) ఆదేశాలను పక్కనపెట్టిన కారణంగా తీవ్ర విమర్శలకు గురై ప్ర‌స్తుత బాధ్య‌తను కోల్పోయారు. ఆయ‌న్ను ట్రాన్స్‌పోర్టు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ (Transport, Roads and Building department)కు ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఇదే క్ర‌మంలో అనేకమంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా స్థానచల‌నం క‌ల్పించిన సర్కారు కొత్త బాధ్యతలను అప్ప‌గించింది. ఈమేర‌కు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించార‌ని… సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన...
ACB Arrest  : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
Crime

ACB Arrest : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ACB Raids | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 వేల డిమాండ్ చేశారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీడియో, ఆడియోటేపుల ఆధారంగా ఎస్ఐ రంజిత్ ను పక్కా ప్లాన్​ వేసి పట్టుకున్నారు. సుమారు మూడు గంటలపాటు విచారించిన అధికారులు.. రంజిత్ లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించారు. ఎస్ ఐ రంజిత్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఖమ్మం ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వారి వద్ద నుంచి రూ.40వేలు ఎస్సై రంజిత్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు పక్కాగా వల పన్ని ఎస్ఐని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో మణుగూరులో కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవి...
మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తు ఎలా? – liquor policy 2025 :
State

మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తు ఎలా? – liquor policy 2025 :

Telangana new liquor policy 2025 : తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తి రెండేళ్ల‌కోసారి మద్యం దుకాణాల లైసెన్స్‌లను పునరుద్ధరిస్తూ కొత్త పాలసీని అమలు చేస్తోంది. 2025-2027 కాలానికి కొత్త మద్యం రీటైల్ పాలసీని ప్ర‌క‌టించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలకు సంబంధించిన దుకాణాల అనుమతులు, లైసెన్స్‌లు, రిజర్వేషన్లు, టెండర్ ప్ర‌క్రియ త‌దిత‌న‌న‌ అంశాలపై సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం పాలసీ ముఖ్యోద్దేశం ఏమిటి? మద్యం పాలసీ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మద్యం విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 40,000 కోట్లకు పైగా ఆదాయం పొందుతోంది. ఒక్క కొత్త లైసెన్స్‌లు, రిన్యువల్స్ ద్వారా సుమారు రూ.6,000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. రాష్ట్రానికి ఆదాయం పెంచడం మాత్రమే కాకుండా విక్ర‌యాల్లో పారదర్శకతను తీసుకురావడమే మ‌ద్యం ...
error: Content is protected !!