Sarkar Live

Privacy Policy

సినీ పరిశ్రమలో విషాదం: ఏవీయం ప్రొడక్షన్స్ అధినేత ఏవీఎం శరవణన్ కన్నుమూత.. -AVM Saravanan
Cinema

సినీ పరిశ్రమలో విషాదం: ఏవీయం ప్రొడక్షన్స్ అధినేత ఏవీఎం శరవణన్ కన్నుమూత.. -AVM Saravanan

AVM Saravanan | చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు ఏవీయం ప్రొడక్షన్స్ ప్రతిష్టను నిలబెట్టిన ప్రముఖ నిర్మాత, సంస్థ వ్యవస్థాపకుడు ఏ.వి. మేయప్ప చెట్టియార్ కుమారుడు ఏవీఎం శరవణన్ (AVM Saravanan) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలంగా చికిత్స అందుతోంది. అయితే, చికిత్స ఫలించక ఈ గురువారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పుట్టినరోజు మరుసటి రోజే.. ఏవీఎం శరవణన్ నిన్ననే (బుధవారం, డిసెంబర్ 3) తన 86వ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం మృతి చెందడం సినీ ప్రముఖులను, అభిమానులను కలచివేసింది. 1945లో ఏ.వి. మేయప్ప చెట్టియార్ స్థాపించిన ఏవీయం ప్రొడక్షన్స్ (AVM Productions), సౌత్ ఇండియన్ సినిమా నిర్మాణంలో అగ్రగామిగా నిలిచింది. మేయప్ప చెట్టియార్...
కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు – Planned killing
Crime

కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు – Planned killing

Karimnagar Murder Planned killing : అప్పులు తీర్చుకోవడానికి ఓ త‌మ్ముడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్న‌(Elder Brother)నే పొట్ట‌న పెట్టుకున్నాడు. మాన‌సిక వైక‌ల్యం (Mentally Challenged)తో ఉన్నాడనే క‌న‌క‌రం కూడా లేకుండా ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం (planned killing) మ‌రో ఇద్ద‌రితో క‌లిసి హ‌త్య‌ చేశాడు. క‌రీంన‌గ‌ర్ జిల్లా (Karimnagar district) రామ‌డుగు మండ‌లంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్యాపార నష్టాలు.. పెరిగిన అప్పులు నిందితుడు మామిడి నరేష్ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్లు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతున్నాడు. ఈ క్ర‌మంలో వ్యాపారంలో వ‌రుస న‌ష్టాలు వ‌చ్చాయి. దీంతో పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఒక‌వైపు వ్యాపారం స‌రిగా న‌డ‌వ‌క‌పోవ‌డం, మ‌రోవైపు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయ‌డంతో న‌రేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.అప్పులు ఎలా తీర్చాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్...
విస్త‌రిస్తున్న Seasonal flu ..రాష్ట్రంలో వైరల్ ఫీవర్ల క‌ల‌క‌లం
State, Hyderabad

విస్త‌రిస్తున్న Seasonal flu ..రాష్ట్రంలో వైరల్ ఫీవర్ల క‌ల‌క‌లం

Seasonal flu : తెలంగాణ‌లో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధులు (ILI కేసులు) కేసులు విస్త‌రిస్తున్నాయి. వైర‌ల్ ఫీవ‌ర్ల (viral fevers) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీటి తీవ్రత హైద‌రాబాద్ (Hyderabad)లో ఎక్కువ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండు వారాలుగా ఆస్ప‌త్రుల్లో అధిక జ్వరం, దగ్గు, శరీరనొప్పులతో వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు. Seasonal flu : ఆస్ప‌త్రుల్లో పెరిగిన‌ ర‌ద్దీ హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రి (Gandhi Hospital), ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ( Osmania General Hospital-OGH), న‌ల్లకుంట ఫీవర్ హాస్పిటల్ (Fever Hospital), NIMSతో పాటు చిన్న క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు కిట‌కిట‌లాడుతున్నాయి. ఈ ఆస్ప‌త్రుల్లో వ‌చ్చేవారిలో తీవ్ర జ్వ‌రం, ఇన్‌ఫ్లూయెంజా ల‌క్ష‌ణాలు ఉన్న వారే (patients) ఎక్కువ‌గా ఉంటున్నార‌ని వైద్యులు తెలి...
Food Poisoning  | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..
Crime

Food Poisoning | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..

Food Poisoning | గద్వాల: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో వ‌రుస‌గా ఫుడ్‌పాయిజ‌న్ కేసులు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో ఈరోజు ఉద‌యం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాలలోని ఎస్టీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తినడం వల్ల 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ద‌వాహాన‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉంటున్నారు. పురుగులు ఉన్నాయని చెప్పినా నిర్లక్ష్యం! ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విద్యార్థులు సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం వండిన ఉప్మాలో పురుగులు ఉన్నట్లు తాము గుర్తించి, వెంటనే హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే వారు ఆ ఆహారాన్ని పారబోసినప్పటికీ, అంతకుముందు దాన్ని తిన్నవారే అస్వస్థతకు గురయ్యారని తెలిపార...
Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!
State, Crime

Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!

హుటాహుటిన ముంబైకి మళ్లింపు.. ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్! హైదరాబాద్‌ | కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో 'మానవబాంబు' బెదిరింపు (Indigo Bomb Threat) కలకలం సృష్టించింది. ఈ తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా హెచ్చరిక అందడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించారు. Bomb Threat : ప్రమాద హెచ్చరిక ఎలా వచ్చింది? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈరోజు వేకువజామున 1:20 నిమిషాలకు బయలుదేరిన ఈ ఇండిగో విమానం (Flight) ఉదయం 7:42 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. "విమానంలో మానవబాంబు ఉంది, దీన్ని పేల్చివేస్తాం" అంటూ దిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వ‌చ్చాయి.. ముంబైలో కట్టుదిట్టమైన భద్రత ఈమెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే అప్రమత్తమై, విమ...
error: Content is protected !!