పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లు జారీ
Heavy Rains in Telangana : తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీగా వానలు కురుస్తున్నాయి.
ఈనెల 21న సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, మెదక్, భూపాలపల్లి, మహబూబాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వ...