Mock Drill | రేపు అన్ని రాష్ట్రాల్లో వైమానిక దాడులపై మాక్ డ్రిల్!
Home Ministry Mock drill Update | ఉగ్రవాదుల ఎరివేతలో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని వెతికి వెతికి వేటాడుతామని ఇదివరకే ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత పాక్పై దౌత్య పరమైన యుద్ధం ప్రారంభించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
మరోవైపు యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో వెనువెంటనే సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home Ministry ) అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈనెల 7న బుధవారం మాక్ డ్రిల్ (Mock drill ) నిర్వహించాలని సూచించింది. వైమానిక దాడులు జరిగ...
