Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి భారీ ఎత్తున బాయిల్డ్ రైస్ సేకరించాలని, పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణ
తెలంగాణలో యాసంగి (Rabi) పంట బాయిల్డ్ రైస్ (Boiled Rice ) మిల్లింగ్కు ఎంతో అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.
ఈ యాసంగి సీజన్లో తెలంగాణలో సుమారు 90 ఎల్ఎంటీ (LMT) ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ (10% నూకతో) సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
కేంద్రం స్పంద...


