రేవంత్ రెడ్డికి ‘ఐడెంటిటీ క్రైసిస్’.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్!
తెలంగాణ రాష్ట్ర సమితి (BRS Party) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభవేళ, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం భవిష్యత్ రాజకీయ పోరాటానికి దిశానిర్దేశం చేసింది. అనంతరం మీడియాలో మాట్లాడిన కేటీఆర్, అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు బీజేపీ ఎంపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు 'ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం' నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.
తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆగ్రహం: "తెలంగాణ అంటే పాకిస్థాన్ కాదు"
పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
మౌనం ఎందుకు?: "తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే అక్కడ ఉన్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా కూర్చున్నారు. ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అక్కడికక్కడే ని...



