Sarkar Live

Day: April 27, 2026

రేవంత్ రెడ్డికి ‘ఐడెంటిటీ క్రైసిస్’..  కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్!
State

రేవంత్ రెడ్డికి ‘ఐడెంటిటీ క్రైసిస్’.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్!

తెలంగాణ రాష్ట్ర సమితి (BRS Party) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభవేళ, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం భవిష్యత్ రాజకీయ పోరాటానికి దిశానిర్దేశం చేసింది. అనంతరం మీడియాలో మాట్లాడిన కేటీఆర్, అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు బీజేపీ ఎంపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు 'ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం' నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆగ్రహం: "తెలంగాణ అంటే పాకిస్థాన్ కాదు" పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మౌనం ఎందుకు?: "తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే అక్కడ ఉన్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా కూర్చున్నారు. ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అక్కడికక్కడే ని...
తెలంగాణ పోలీసులకు శుభవార్త
Crime

తెలంగాణ పోలీసులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర పోలీసులు కు డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. హోదాతో నిమిత్తం లేకుండా కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ​సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ద్వారా వారిలో పని పట్ల ఉత్సాహం, మనోధైర్యం పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర పరిస్థితులు (శాంతిభద్రతల సమస్యలు) ఉంటే తప్ప, సిబ్బంది కోరినప్పుడు యూనిట్ అధికారులు ఈ సెలవులను నిరాకరించకూడదు. సర్వీస్ రిజిస్టర్‌లో నమోదైన తేదీల ఆధారంగానే ఈ ప్రత్యేక సెలవులు మంజూరు చేయబడతాయి. నిబంధనలు.. ​సెలవు కావాల్సిన సిబ్బంది ముందుగానే రాతపూర్వక అభ్యర్థనను తమ పై అధికారులకు అందజేయాలి. ​ రాష్ట్రంలో అత్యంత కీలకమైన భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే ఈ సెలవుకు మి...
ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం: ‘ఆన్లైన్ ట్రక్ షీట్’ విధానాన్ని ఎత్తివేయాలని రైతుల డిమాండ్ – Agriculture News
State

ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం: ‘ఆన్లైన్ ట్రక్ షీట్’ విధానాన్ని ఎత్తివేయాలని రైతుల డిమాండ్ – Agriculture News

​ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్లైన్ ట్రక్ షీట్’ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే ఈ విధానాన్ని ఎత్తివేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ​ఏమిటీ సమస్య? ​సాధారణంగా రైతులు ఐకేపీ (IKP) సెంటర్లకు ధాన్యం తెచ్చినప్పుడు, గతంలో మాన్యువల్ పద్ధతిలో తూకం వేసి వెంటనే రశీదులు ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం అమలు చేస్తున్న ఆన్లైన్ ట్రక్ షీట్ విధానంలో సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారాయి.ప్రధానంగా సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.ఆన్లైన్ పోర్టల్ తరచూ మొరాయించడం వల్ల ట్రక్ షీట్లు జనరేట్ కావడానికి గంటల సమయం పట్టే అవకాశం ఉంది.అలాగే రవాణాలో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంది.ట్రక్ షీట్ వస్తే తప్ప లారీలకు అనుమతి లభించని పరిస్థితి నెలకొంది.దీనివల్ల ధాన్యం బస్తాలు రో...
గులాబీ జెండాకు పాతికేళ్లు: నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు! – BRS Party 25 Years
Special Stories

గులాబీ జెండాకు పాతికేళ్లు: నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు! – BRS Party 25 Years

​ తెలంగాణ రాజకీయ యవనికపై ఒక ప్రభంజనంలా ఉద్భవించి, ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఉద్యమంగా మార్చి, గమ్యాన్ని ముద్దాడిన భారత్ రాష్ట్ర సమితి (BRS Party) నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. 2001 ఏప్రిల్ 27న 'జలదృశ్యం' వేదికగా కేసీఆర్ నాటిన మొక్క, నేడు మహావృక్షమై పాతికేళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు పండుగ వాతావరణంలో రజతోత్సవ వేడుకలకు సిద్ధమయ్యాయి. ​అస్తిత్వం నుంచి అధికారం దాకా.. ​2001లో కేవలం కొద్దిమంది అనుచరులతో, "తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయి" అనే నినాదంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి 2014 వరకు అలుపెరగని పోరాటం, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలతో దేశం చూపు తెలంగాణ వైపు తిరిగేలా చేశారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు ప...
error: Content is protected !!