ఆలయంలో చోరీ: 24 గంటల్లోనే అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్!
•రూ. 2.40 లక్షల విలువైన వెండి సామాగ్రి, కారు స్వాధీనం
•నిందితుల్లో ఒకరిపై రెండు రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు
•ఆత్మకూర్ పోలీసులను అభినందించిన పరకాల ఏసీపీ సతీష్ బాబు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు భారీ చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. గూడెప్పాడు ఆలయంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థులను అరెస్ట్ చేసి, వారి నుండి రూ. 2.40 లక్షల విలువైన 1080 గ్రాముల వెండి సామాగ్రితో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల ఏసీపీ సతీష్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు.
అర్ధరాత్రి దొంగతనం.. టెక్నాలజీతో చెక్!
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్లోని భీమవరం ప్రాంతానికి చెందిన కల్లకూరి కిరణ్ బాబు, అనంతపురం జిల్లాకు చెందిన సందీప్ కుమార్ ఇరువురు ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆ...



