Sarkar Live

Day: May 20, 2026

ఆలయంలో చోరీ: 24 గంటల్లోనే అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్!
Crime

ఆలయంలో చోరీ: 24 గంటల్లోనే అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్!

​•రూ. 2.40 లక్షల విలువైన వెండి సామాగ్రి, కారు స్వాధీనం ​•నిందితుల్లో ఒకరిపై రెండు రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు ​•ఆత్మకూర్ పోలీసులను అభినందించిన పరకాల ఏసీపీ సతీష్ బాబు ​ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు భారీ చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. గూడెప్పాడు ఆలయంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థులను అరెస్ట్ చేసి, వారి నుండి రూ. 2.40 లక్షల విలువైన 1080 గ్రాముల వెండి సామాగ్రితో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల ఏసీపీ సతీష్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ​అర్ధరాత్రి దొంగతనం.. టెక్నాలజీతో చెక్! ​ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం ప్రాంతానికి చెందిన కల్లకూరి కిరణ్ బాబు, అనంతపురం జిల్లాకు చెందిన సందీప్ కుమార్ ఇరువురు ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆ...
రూ. వెయ్యి లంచం అడిగినా ఫిర్యాదు చేయండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి! – CM Joseph Vijay Anti Corruption Campaign
National

రూ. వెయ్యి లంచం అడిగినా ఫిర్యాదు చేయండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి! – CM Joseph Vijay Anti Corruption Campaign

​అవినీతిపై సీఎం విజయ్‌ ‘సమరం’: ​అవినీతి రహిత పాలనే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వ సంచలన నిర్ణయం ​నేరుగా ప్రజల నుంచే సమాచార సేకరణ.. ప్రత్యేక హెల్ప్‌లైన్, పోర్టల్ ఏర్పాటు ​CM Joseph Vijay Anti Corruption Campaign | తమిళనాడులో అవినీతిని అంతమొందించడమే ధ్యేయంగా నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో లంచగొండితనానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా, ఏ అధికారి అయినా చిన్న మొత్తంలో.. అంటే కేవలం రూ. 1,000 లంచం అడిగినా సరే, ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సీఎం విజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా నిజాయితీతో కూడిన సమాచారం అందించి, అవినీతి తిమింగలాలను పట్టుకోవడంలో సహకరించిన పౌరులకు ప్రభుత్వం తరఫున రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు. ​ప్రజల నుంచే నేరుగా సమాచారం! ​పాలనలో పారదర...
రేపే కాళేశ్వరంలో ‘సరస్వతీ అంత్య పుష్కరాల’ ప్రారంభం – Saraswathi Antya Pushkaralu
State, warangal

రేపే కాళేశ్వరంలో ‘సరస్వతీ అంత్య పుష్కరాల’ ప్రారంభం – Saraswathi Antya Pushkaralu

Saraswathi Antya Pushkaralu Kaleshwaram 2026 | కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరిగే అత్యంత ప్రతిష్టాత్మక ‘సరస్వతీ అంత్య పుష్కరాలకు’ సర్వం సిద్ధమైంది. మే 21వ తేదీ (గురువారం) నుంచి జూన్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ముక్కోటి పుణ్యతీర్థానికి సుమారు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూ. 30.63 కోట్ల నిధులతో భారీ ఎత్తున పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తొలి పుణ్యస్నానం ఎప్పుడంటే? పుష్కరాల తొలిరోజైన 21వ తేదీ తెల్లవారుజామున 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాలు గోదావరి-సరస్వతీ నదిలో పుష్కర స్నానం ఆచరించి, ఈ అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. మే 21 నుంచి జూన్ 1 వరకు ప్రతి రోజూ దేశంలోని ఒక ప్రముఖ పీఠానికి ...
Corruption | ముడుపులు ముడితే ‘సర్వే’ తారుమారు.. అటెండర్ టూ డీఐ ప్రస్థానం వెనుక మర్మమేంటి?”
Special Stories

Corruption | ముడుపులు ముడితే ‘సర్వే’ తారుమారు.. అటెండర్ టూ డీఐ ప్రస్థానం వెనుక మర్మమేంటి?”

​అటెండర్ టు డీఐ.. సదరు అధికారి ప్రమోషన్లపై గుసగుసలు ​25 ఏళ్లుగా ఒకే జిల్లాలో తిష్ఠవేసిన డీ ఐ ​రెవెన్యూ గెస్ట్ హౌస్ కేంద్రంగా సెటిల్మెంట్లు? ​ముచర్ల భూముల్లో రైతులపై ప్రతాపం.. బదిలీ ఆపుకునేందుకు పాట్లు ​Revenue DI Corruption Survey Numbers Tampering | సదరు అధికారికి ముడుపులు ముడితే చాలు.. వివాదాస్పద భూముల సర్వే నెంబర్లు మారిపోతాయి, రికార్డుల్లో మ్యాపులు తారుమారైపోతాయి! బాధితులు లబోదిబోమన్నా పట్టించుకునే నాథుడే లేడు. అటెండర్ స్థాయి నుంచి జిల్లా ఇన్‌స్పెక్టర్ (డీఐ) స్థాయికి ఎదిగిన సదరు అధికారి వ్యవహార శైలిపై ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఒకే జిల్లాలో పాతుకుపోయి, బదిలీ రాకుండా చక్రం తిప్పుతున్న ఆ అధికారి లీలలపై ప్రత్యేక కథనం. ​ఉద్యోగం చేస్తూ కాలేజీకి ఎప్పుడెళ్లారు? ​అటెండర్ ఉద్యోగంతో ప్రస్థానం ప్రారంభించిన సదరు అధికారి, ఆ తర్వాత వరుస ప్రమోషన్లతో డీఐ స్...
error: Content is protected !!