Sarkar Live

Lucknow bank heist | ల‌క్నోలో బ్యాంక్ దోపిడీ.. పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు నిందితుల మృతి..

Lucknow bank heist | లక్నో బ్యాంకు దోపిడీ కేసులో కీల‌క పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత 24 గంటల్లో రాష్ట్ర రాజధాని, ఘాజీపూర్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు కీలక నిందితులను హతమార్చారు. లక్నోలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)కి

Yadadri Bhuvanagiri News

Lucknow bank heist | లక్నో బ్యాంకు దోపిడీ కేసులో కీల‌క పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత 24 గంటల్లో రాష్ట్ర రాజధాని, ఘాజీపూర్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు కీలక నిందితులను హతమార్చారు. లక్నోలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)కి చెందిన 42 లాకర్లను పగులగొట్టి కోట్ల విలువైన నగలు, ఇతర విలువైన వస్తువులను ముఠా సభ్యులు దోచుకెళ్లారు (Bank Loot ). ఈ క్ర‌మంలో పోలీసులు పలుచోట్ల ఎన్‌కౌంట‌ర్లు చేప‌ట్ట‌గా ఇద్ద‌రు హ‌తమ‌య్యారు.

Lucknow Encounter : లక్నోలోని చిన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ పథ్‌లో పోలీసులకు, నిందితులకు మధ్య జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లో నిందితుడు సోబింద్ కుమార్ (29) హతమయ్యాడు. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు ఉన్న మరో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

ఘాజీపూర్‌లో రెండో ఎన్‌కౌంటర్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ఘాజీపూర్‌లో రెండో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మరో నిందితుడు సన్నీ దయాల్ హతమయ్యాడు. బీహార్ సరిహద్దులో గహ్మార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బారా పోలీస్ పోస్ట్ సమీపంలో దయాల్, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బ్యాంకు లాకర్ పగలగొట్టిన నిందితుడు దయాళ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు ఎస్పీ ఈరాజ్ రాజా ధృవీకరించారు.

తూర్పు లక్నో డీసీపీ శశాంక్ సింగ్ మాట్లాడుతూ, “CP నేతృత్వంలోని క్రైమ్ టీమ్. PS చిన్హట్ బృందం వారి సాధారణ కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండ‌గా దుండ‌గులు కారులో అతివేగంగా పోలీసుల‌ వైపుకు రావడం కనిపించింది… కారులో కూర్చున్న ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు.. దీంతో పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించాల్సి వ‌చ్చింది. ఇందుఓ గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.. పరారీలో ఉన్న వ్యక్తి కోసం అన్వేషణ కొనసాగుతోంది. వారి నుంచి పెద్ద మొత్తంలో వెండి, బంగారు ఆభరణాలు, బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు

Lucknow bank heist : ఇప్పటి వరకు నలుగురి అరెస్టు

ఇదిలా ఉండగా, లక్నోలోని IOB బ్రాంచ్‌లో దోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు మూడు ఎన్‌కౌంటర్ల తర్వాత ఇప్పటివరకు అరెస్టు చేశారు. లక్నోలోని చిన్‌హట్ ప్రాంతంలోని లౌలై గ్రామంలోని కిసాన్ పథ్ సమీపంలో ఒక పోలీసు బృందం రెండు వాహనాలను ఆపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

పోలీసు బృందం ఒక వాహనం సమీపంలోకి రాగానే, వారు పోలీసులపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకారంగా అరవింద్‌ కుమార్‌ అనే వ్యక్తి కాలుపై కాల్పులు జరిపి అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన కుమార్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చిన్‌హాట్ బ్రాంచ్‌లో ఆదివారం చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతడికి సహకరించిన ఇద్దరు బలరాం, కైలాష్‌లను కూడా అరెస్టు చేశారు. మరో వాహనంలో వెళుతున్న నలుగురు నిందితులు పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?