Indiramma Atmiya Bharosa Scheme : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. ఈ స్కీమ్ కింద రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని రెండు విడతలుగా అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఆన్లైన్లో వివరాల నమోదుకు ఇప్పటికే గడువు పూర్తయింది. గ్రామ సభలు, మండల కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దాదాపు సుమారు 6 లక్షల మందిని లబ్ధిదారులను ఎంపిక చేసింది. కొత్తగా వచ్చిన 2,24,487 అప్లికేషన్లలో 19,193 దరఖాస్తులను ఆమోదించారు. 1,44,784 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యయాయి. మరో 59,542 దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. ఇందిరమ్మ భరోసాకు 5,80,577 మందిని అర్హులుగా గుర్తించారు. కాగా ఉపాధి హామీ పథకం కింద 2023-24లో 20 రోజుల పనిదినాలను పూర్తి చేసిన వారినే లబ్ధిదారులుగా ప్రభుత్వం ఎంపిక చేస్తోంది.
Indiramma Atmiya Bharosa : దరఖాస్తుల తిరస్కరణకు కారణం ఇదే..
కుటుంబ యజమాని పేరిట గానీ, ఇతర కుటుంబ సభ్యులకు గానీ ఒక్క సెంటు భూమి ఉన్నా వారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి (Indiramma Atmiya Bharosa Scheme ) అన్హరులు పరిగణిస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలో పలు దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇంటి పెద్దకు కానీ, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 10 ఏళ్ల క్రితం భూమి అమ్ముకున్నా వారి పేర్లు రికార్డుల్లో ఉండటంతో వారిని కూడా ఈ పథకానికి అర్హులుగా చేర్చలేదు. భూమి విక్రయించినా, రికార్డుల్లో వారి పేరు ఉన్న వారిని ప్రస్తుతానికి వారిని లబ్దిదారులుగా అధికారులు గుర్తించడం లేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..