హైదరాబాద్: ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆరు నెలల పాటు రైలు నంబర్ 20707/20708 సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ( Vande Bharat Express) కు ఏలూరు స్టేషన్లో అదనపు స్టాప్లను కొనసాగించనుంది.
Vizag Vande Bharat Rail : ఏలూరు రైల్వే స్టేషన్లో రైలు నంబర్ 20707 సికింద్రాబాద్ – విశాఖపట్నం అదనపు స్టాప్ ఫిబ్రవరి 25 నుండి, రైలు నంబర్ 20708 విశాఖపట్నం – సికింద్రాబాద్ ఫిబ్రవరి 26 నుండి అమలులోకి వస్తుంది.
పలు రైళ్ల రద్దు..
దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన మరో వార్త.. హైదరాబాద్ డివిజన్లోని మనోపాడ్ – అలంపూర్ రోడ్డు మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా, ఫిబ్రవరి 8, 26 మధ్య కొన్ని రైళ్ల సర్వీసులు పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్ రైల్వే.. సికింద్రాబాద్ – కర్నూలు సిటీ (17023), కర్నూలు సిటీ – సికింద్రాబాద్ (17024) సర్వీసులు పాక్షికంగా రద్దు చేసింది. అదేవిధంగా, కర్నూలు సిటీ – సికింద్రాబాద్ (17024) సర్వీసులను తిరిగి షెడ్యూల్ చేస్తారు. రైలు షెడ్యూల్లలో మార్పును గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులను అభ్యర్థించారు .
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







