Sarkar Live

Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక క‌స‌రత్తు షురూ..

Young India Residential Schools | తెలంగాణ‌లో యంగ్ ఇండియా రెసిడెన్సియ‌ల్ స్కూల్స్ ఏర్ప‌డ‌నున్నాయి. ఇందుకు ప్ర‌భుత్వం క‌స‌రత్తును ప్రారంభించింది. ఈ పాఠశాలల నిర్మాణానికి సుమారు రూ.5 వేల‌ కోట్లను స‌ర్కార్ ఇప్ప‌టికే కేటాయించింది. మొత్తం 100 అసెంబ్లీ నియోజ‌క‌ర్గాల్లో ఒక్కొక్క‌టి

Young India Residential Schools

Young India Residential Schools | తెలంగాణ‌లో యంగ్ ఇండియా రెసిడెన్సియ‌ల్ స్కూల్స్ ఏర్ప‌డ‌నున్నాయి. ఇందుకు ప్ర‌భుత్వం క‌స‌రత్తును ప్రారంభించింది. ఈ పాఠశాలల నిర్మాణానికి సుమారు రూ.5 వేల‌ కోట్లను స‌ర్కార్ ఇప్ప‌టికే కేటాయించింది. మొత్తం 100 అసెంబ్లీ నియోజ‌క‌ర్గాల్లో ఒక్కొక్క‌టి చొప్పున ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (Young India Residential Schools) ఏర్పాటవుతున్నాయి. ఒక్కోదానికి 20-25 ఎక‌రాల భూమి అవ‌స‌రం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ స్కూల్స్ నిర్మాణానికి భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) ఆదేశించారు. శుక్రవారం జరిగిన విద్యా సమీక్ష సమావేశంలో ప‌లు అంశాల‌పై ఆయ‌న స‌మీక్షించారు.

Young India Residential Schools లో ఎలాంటి సౌక‌ర్యాలంటే..

యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో 4 నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాసం ఉంటుంది. వీటి ద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగావకాశాలను పెంపొందించడం త‌మ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ పాఠశాలల్లో విద్యార్థులు కేవలం పాఠశాల విద్యనే కాకుండా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, క్రీడా శిక్షణ వంటి సదుపాయాలను కూడా ఉంటాయ‌ని అంటోంది. డిజిట‌ల్ క్లాసులు, అక‌డ‌మిక్ బ్లాక్‌, ప్లేగ్రౌండ్‌తోపాటు ఉచిత వ‌స‌తి, భోజ‌నం, యూనిఫామ్ లాంటి సౌక‌ర్యాల‌ను ఈ స్కూల్స్‌లో స‌ర్కారు స‌మకూర్చ‌నుంది. కార్పొరేట్ స్థాయి విద్య‌ను అందించి తెలంగాణ బిడ్డ‌ల‌ను ప్ర‌యోజ‌కులు చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారు.

అధికారుల‌కు సీఎం ఆదేశాలు

యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (TG Young India Residential Schools ) కోసం భూసేక‌ర‌ణ ప్ర‌క్ర‌య‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించాల‌ని అధికారులను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ పాఠ‌శాల‌ల్లో స‌మ‌కూర్చాల్సిన సౌక‌ర్యాల‌పై దృష్టి పెట్టాల‌ని అన్నారు. ముఖ్యంగా విద్యార్థుల‌కు అనువైన ప్ర‌దేశంలోనే ఈ పాఠ‌శాల‌ల‌ను నిర్మించాల‌ని, అందుకు అనుగుణంగా భూ సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని అన్నారు. ప్లేగ్రౌండ్, అకడమిక్ బ్లాక్‌తోపాటు భవిష్యత్తు అవసరాలను తీర్చే ఇతర సౌక‌ర్యాల‌ కోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడమే త‌మ ధ్యేయ‌మ‌ని సీఎం అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పాఠశాలలను స్థాపించడం ద్వారా విద్యార్థులు సమానమైన అవకాశాలు పొందే విధంగా కృషి చేస్తున్నామ‌ని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!