తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు (TG budget session) రసాభాసాగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు ( BRS legislators) పలుమార్లు అంతరాయాలు కలిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పంట రుణ మాఫీ, రైతు భరోసా వంటి పథకాలను తన గవర్నర్ ప్రసంగం (Governor Jishnu Dev Verma’s speech)లో ప్రశంసించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకాలు పూర్తిగా అమలు కాలేదని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) రైతు వేదికలను ఏర్పాటు చేసిందని, అలాగే రైతులకు రూ.500 బోనస్ అందించిందని గవర్నర్ పేర్కొనడంతో బీఆర్ఎస్ శాసన సభ్యులు తీవ్రంగా ఆరోపించారు. ఈ పథకాలు గతంలో ముఖ్యమంత్రి కెసీఆర్ హయాంలోనే ప్రారంభమయ్యాయని మండిపడ్డారు.
ప్రాజెక్టుల నీటి మళ్లింపుపై నిరసన
తెలంగాణ రాష్ట్ర జల హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశంసించగా బీఆర్ఎస్ శాసన సభ్యులు దీనిని వ్యతిరేకించారు. ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని, ఆంధ్ర ప్రదేశ్ అనుమతిలేకుండా నీటిని మళ్లిస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
వైద్య సేవలు శూన్యమంటూ నినాదాలు
రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని గవర్నర్ పేర్కొనగా ప్రతిపక్ష సభ్యులు “సున్నా, సున్నా” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. కుల గణనను కూడా వారు నకిలీగా అభివర్ణించారు. సమావేశం మొత్తం “20 శాతం కమిషన్” అంటూ బీఆర్ఎస్ శాసన సభ్యులు నినాదాలు చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఉందని ఆరోపించారు. హాస్టల్ విద్యార్థుల మరణాలపై కూడా బీఆర్ఎస్ శాసన సభ్యులు తీవ్రంగా స్పందించారు. హాస్టళ్లల్లో సౌకర్యాలు లేకపోవడం, పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థులు ప్రాణాలు వదులుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు.
TG budget session : గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగించిన అనంతరం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి. రామారావు ( BRS working president KT Rama Rao) మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గవర్నర్తో కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana government) అబద్ధాలు చెప్పించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని 420 నెరవేర్చని వాగ్దానాలు, ఆరు హామీల గురించి గవర్నర్ ప్రస్తావించకపోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను విస్మరించిందని, పంట రుణ మాఫీని అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు.
TG budget session : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిందని గుర్తు చేశారు. రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతుకూ ప్రతి పంట సీజన్కు ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. ఈ పథకం దేశంలోనే మొదటిసారిగా నేరుగా రైతులకు పెట్టుబడి సహాయం అందజేస్తున్న పథకంగా గుర్తింపు పొందిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. పంట రుణ మాఫీ వంటి కీలక హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, దీని ఫలితంగా రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 thoughts on “TG budget session | రసాభాసాగా అసెంబ్లీ సమావేశం.. కాంగ్రెస్పై బీఆర్ఎస్ గరం గరం”