Mangalagiri AIIMS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి(Mangalagiri)లోని ఎయిమ్స్ (All India Institute of Medical Sciences (AIIMS) ఆస్పత్రి అభివృద్ధికి కేంద్రం (Central Government) పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ వృద్ధికి, అవసరమైన శాశ్వత సిబ్బందిని నియమించేందుకు (appointment of permanent staff members) కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekha) చర్యలు చేపట్టారు. గతంలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ సమర్థంగా పని చేయడానికి అవసరమైన శాశ్వత ఉద్యోగాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని పరిష్కారం కోసం కేంద్ర స్థాయిలో చొరవ తీసుకుంటోంది.
శాశ్వత సిబ్బంది లేక ఇబ్బందులు
Mangalagiri AIIMS ఆస్పత్రి అనేది అత్యాధునిక వైద్య సేవల ప్రాధాన్యతను కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ (central government healthcare institution). ఈ హాస్పిటల్ను 960 పడకల సామర్థ్యంతో నిర్మించారు. దేశంలోని అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి ఇది ఒక కేంద్ర బిందువుగా మారనుంది. అయితే.. ఇంత పెద్ద ఆస్పత్రి (hospital)కి అవసరమైన శాశ్వత సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. నిరంతరంగా సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన విజ్ఞప్తి మేరకు శాశ్వత ప్రతిపదికన 534 పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, బోధనా సిబ్బంది ఉద్యోగాలు ఉన్నాయి.
Mangalagiri AIIMS : మంజూరైన 534 పోస్టులు ఇవి..
- అసోసియేట్ ప్రొఫెసర్లు – 10 పోస్టులు
- అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 40 పోస్టులు
- సీనియర్ రెసిడెన్సీలు – 100 పోస్టులు
- జూనియర్ రెసిడెన్సీలు – 100 పోస్టులు
- డిప్యూటీ నర్సింగ్ సూపరిండెంట్లు – 3 పోస్టులు
- అసిస్టెంట్ నర్సింగ్ సూపరిండెంట్లు – 10 పోస్టులు
- నర్సింగ్ ఆఫీసర్లు – 100 పోస్టులు
- మిగతా పోస్టులు వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
ఈ నియామకాలతో ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత ప్రభావవంతంగా జరిగే అవకాశం ఉంది. ఆయా విభాగాల్లో నిపుణులను నియమించడం ద్వారా చికిత్సా నాణ్యత, బోధనా ప్రమాణాలు, ఆస్పతి నిర్వహణ అన్ని మెరుగుపడతాయని తెలుస్తోంది.
రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు
ఈ నియామకాల (appoint permanent) ద్వారా మంగళగిరి AIIMS ఆస్పత్రికి శాశ్వత సిబ్బందితో మరింత బలపడనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రజలకు అత్యాధునిక మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చులో అత్యుత్తమ వైద్యం అందుతుంది. విద్యార్థులకు మెడికల్ విద్యలో నాణ్యమైన శిక్షణ లభిస్తుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.