కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Adilabad News : తెలంగాణ నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే హైదరాబాద్(Hyderabad)-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి ( Rajiv Highway ) ని జాతీయ రహదారిగా మార్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ రహదారిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్ల ఈ రాజీవ్ రహదారి పూర్తిగా అధ్వానంగా మారిందని తెలిపారు.రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ (Nitin Gadkari) హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్ అన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ చూపాలని
ఆయన సూచించారు.
కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో సోమవారం రూ.6100 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పలు రహదారులకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy), రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy), సీతక్క, ఎంపీలు వంశీ, నగేశ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Minister Bandi Sanjya) ప్రసంగించేందుకు వేదిక వద్దకు రాగానే సభకు హాజరైన వేలాది మంది ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ భారత్ మాతాకీ జై అంటూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజయ్ ప్రసంగించారు.
కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ(Telangana)లో మరిన్ని రోడ్ల నిర్మాణాలను ప్రారంభించేందు కోసం ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 6 వేల 100 కోట్ల రూపాయలతో 167 కి.మీ. మేర మొత్తం 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించిన కార్యక్రమాలను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తుండటం సంతోషంగా ఉంది.
రాష్ట్ర మంత్రి వెంకట్ రెడ్డి గడ్కరీ ప్రామిస్ చేశారు. హైదరాబాద్ నుండి మంచిర్యాల (Mancerial)రోడ్డు వరకు రాజీవ్ రహదారి(Rajiv Highway) నాగుపాములా ఉండేది. క్వాలిటీ లేకుండా పనులు చేశారు. రహదారి బాగాలేదు. దయచేసి ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడండి. ఆ సమస్యను పరిష్కరిస్తే రాజీవ్ రహదారి(Rajiv Highway)ని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. గడ్కరీ కూడా హామీ ఇచ్చారు. వెంటనే ఈ విషయంలో కోమటిరెడ్డి చొరవ తీసుకోవాలని కోరుతున్నా అని బండి సంజయ్ వాఖ్యానించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.